చింతమనేని కి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!
మొన్న జర్నలిస్టులపై దారుణంగా బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ ఐన చింతమనేని వీడియో పై చాలా మంది నెటిజన్లు తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీపై మరియు చంద్రబాబుపై విరుచుకుపడిన సంగతి మనకందరికీ తెలిసినదే. అయితే ఇది గడిచి రోజులు గడవక ముందే మరొక వ్యక్తి పై చింతమనేని అనుచరులు దారుణంగా దాడి చేశారు.
దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు కూడా నమోదైంది. ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడంలేదని చింతమనేనిపై మండిపడ్డారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
చింతమనేని తీరుపై పార్టీ సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఒకరు చేసిన తప్పుకు అందరూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్ ఉంటుందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దీంతో మరొకసారి చింతమనేని ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.