టాలీవుడ్ కమెడియన్ కి షాక్ ఇచ్చిన జగన్...నా దృష్టిలో ప్రజలే హీరోలు !

KSK
వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అశేష ప్రజల మధ్య దిగ్విజయంగా సాగుతోంది. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా వాసులు జగన్కి నీరాజనం పడుతూ వారి సమస్యలు చెబుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమని 2014 ఎన్నికలలో ఏవిధంగా అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేశారో ప్రతి విషయాన్ని జగన్ కి తెలియజేస్తూ బాధపడుతున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో 2014 ఎన్నికలలో చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లా వాసులు అనవసరంగా చంద్రబాబు డి ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాభివృద్ధికి అడ్డు పడ్డామని బాధపడుతున్నారట.


ఇదిలావుండగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కమెడియన్ పృథ్వి తాజాగా జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ వెంట కొంత దూరం నడిచిన కమెడియన్ పృథ్వి ప్రజల స్పందన గురించి..అలాగే తెలుగు సినిమా రంగంలో జగన్ పట్ల వున్న అభిమానం గురించి మీడియాకు తెలియజేశారు.


కమెడియన్ పృథ్వి మాట్లాడుతూ...తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటానని ఈ సందర్భంగా పృథ్వీ పేర్కొన్నారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో నటులు..నటీమణలు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని , పాదయాత్ర ముగియాగానే జగన్ ని కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారట . అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో  ఉన్న కుర్రహీరోలు చాలామంది వైసీపీ పార్టీలోకి వచ్చి జగన్ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్దంగా ఉన్నారని, చాల మంది వస్తాం..మా మాటగా అన్నకు తెలియజేయి అని కొంతమంది హీరోలు కమెడియన్ పృథ్వి కి తెలియజేశారట.


ఇదే విషయాన్ని కమెడియన్ పృథ్వి జగన్కి తెలియజేయడంతో జగన్ ఎంతగానో సంతోషించారట. అయితే జగన్ మాత్రం నా  దృష్టిలో నిజమైన హీరోలు ప్రజలే అని పేర్కొన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి చాలామంది రాజకీయ నాయకులు పార్టీలోకి వచ్చి వెళ్ళిపోయారు...కానీ నిరంతరం నాకు అండగా నిలబడింది...నిలబడుతుంది కూడా ప్రజలే అని కమెడియన్ పృథ్వి కి తెలియజేసి షాక్ ఇచ్చారట జగన్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: