పోస్టల్ బ్యాలెట్: ఆంధ్రాలో సరికొత్త రికార్డ్.. ఉద్యోగులు ఎటువైపు..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతలకు మరింత టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది.. ఈసారి ఎన్నికలు మరింత రసవద్దంగానే కనిపించనున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో టీచర్ల దగ్గర నుంచి సచివాల సిబ్బంది దాకా అందరూ కూడా ఎన్నికల డ్యూటీలో ఉంటారు. అప్పుడు వాళ్ళను సొంత ఊరిలో వేయరు. వాళ్ళ ఇంటిదగ్గర వేయరు .. వాళ్ల దగ్గర వాళ్లు ఓటు వేసుకోవడానికి కుదరదు. కాబట్టి వీరందరూ కూడా ముందుగానే ఓటు వేసుకోవచ్చు.. దీనినే పోస్టల్ బ్యాలెట్ అంటారు.. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్లు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మైండ్ సెట్ ను తెలియజేస్తూ ఉంటాయి.

ఈ పోస్టల్ బ్యాలెట్ ను సంబంధించి ఒక రికార్డు నమోదయింది.. ఈసారి ఏకంగా 5 లక్షల మంది ఉద్యోగులు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను ఉపయోగించబోతున్నారు. ఈనెల 5, 6 ,7 ,8 తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే తమ ఓటు హక్కును సైతం వినియోగించుకోనున్నారు. ఈ విషయం పైన ఈసి కూడా అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపుగా 5 లక్షల మందికి పైగా ఎన్నికలలో పాల్గొని ఉద్యోగస్తులకు అందులో 4,50,000 మంది పోస్టల్ ఓటింగ్కి దరఖాస్తు చేసుకున్నారట.

అంగన్వాడీలతో పాటు మరొక 50,000 మంది మాత్రం ఇవ్వరు.. అయితే వీరు ఎక్కడికక్కడే ఓటింగ్ వేసుకొని అవకాశం ఉంటుంది.. కాబట్టి ఈ నాలుగు లక్షల 50 వేల మంది వినియోగించుకోనున్నారు.. సాధారణంగా ఈ ఓట్లన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటాయని ఆశ పడుతున్నాయి మిగిలిన పార్టీ నేతలు.. ఈ ఎన్నికల తోని అధికారంలోకి ఏ పార్టీ వస్తుందని విషయం పైన కూడా కాస్త అంచనా వేయొచ్చని పలువురు నేతలు కూడా తెలియజేస్తున్నారు. మరి ఉద్యోగులు ఎవరి పక్షాన ఉన్నారా తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు వాడివేడుగా ముందుకు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: