జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం ప్రాణంగా ఎదురు చూస్తోన్న టాలీవుడ్ !
అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశానికి మద్దతు తెలిపిన కొంతమంది ప్రస్తుతం జనసేన పార్టీకి జై కొడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీ కి ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి మద్దతు తెలుపుతున్నారు...ఇదే విషయాన్ని చాలా చాలా ఇంటర్వ్యూలలో పోసాని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో కమెడియన్ పృథ్వి వైసీపీ అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో తన స్నేహితుడు శుభకార్యానికి వచ్చిన పృధ్వి మీడియాతో మాట్లాడారు...పృథ్వి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల నుండి వైసీపీ పార్టీ కి ప్రచార కార్యదర్శిగా పని చేస్తున్నాను. ఉత్తరాంధ్రలో విస్తృతంగా ప్రచారం చేశాను. అయితే గత ఎన్నికలలో చంద్రబాబు చెప్పిన అబద్దాలను ప్రజలు నమ్మి మోసపోయారు..రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చంద్రబాబు మోసం చేసి అధికారంలో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఇప్పటివరకు చంద్రబాబు చెప్పిన ఒక్క మాట..హామీ కూడా నెరవేర్చలేకపోయారని అన్నారు.
మరోపక్క జగన్.. చంద్రబాబు చేతిలో మోసపోయిన ప్రజలను పలకరిస్తూ వారికి ధైర్యం చెబుతూ ఎండనక వాననక ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు వచ్చేఎన్నికలలో కచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని పృథ్వి జోస్యం చెప్పారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో నేను మాత్రమే కాక చాలామంది ప్రముఖులు జగన్ రావాలని ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.