ఆ తేదీ నుండి ఓటీటీ లోకి "బడే మియా చోటే మియా"..!

MADDIBOINA AJAY KUMAR
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి అక్షయ్ కుమార్ , టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో బడే మియా చోటే మియా అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుల విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఓ కీలకమైన పాత్రలో నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీమణులు అయినటువంటి సోనాక్షి సిన్హా , మానుషి చిల్లర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు.  

అలాయా ఎఫ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించారు. మార్సిన్ లస్కావీక్ ఈ మూవీ కి చాయా గ్రహణం చేయగా , అలీ అబ్బాస్ జాఫర్ , ఆదిత్య బసు ఈ సినిమాకు రచన అందించాడు.  విశాల్ విశ్ర ఈ మూవీ కి పాటలు రాయగా , జూలియస్ పాకియం ఈ సినిమాకి నేపథ్య సంగీతం అందించారు. జాకీ భగ్నానీ , వషు భగ్నానీ , దీప్సికా దేశ్‌ముఖ్ , అలీ అబ్బాస్ జాఫర్ , హిమాన్షు కిషన్ మెహ్రా ఈ మూవీ ని నిర్మించగా , అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 11 , 2024 వ తేదీన విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ వారు జూన్ 6 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయబోతోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మరికొన్ని రోజుల్లోనే రానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: