పొలిటికల్ జెయింట్ కిల్లర్ : రాజకీయ గురువుకే శఠగోపం పెట్టిన రజిని..అసలైన వెన్నుపోటు ఇదేనేమో..?

murali krishna

* రాజకీయంగా ఓనమాలు నేర్పిన గురువుకే పోటీగా నిలిచిన రజిని
* స్థానిక ప్రజలను ఆకట్టుకోవడంలో రజిని పబ్లిసిటీ స్టంట్ సక్సెస్
* ఎమ్మెల్యే గా గెలుపొందిన మొదటి సారికే  దక్కిన మంత్రి పదవి

ఆంధ్రప్రదేశ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ విడదల రజిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది. అయితే రజినికి అంతకు ముందు ఎన్నికలలో పోటీ చేసిన అనుభవం లేదు.అలాగే పొలిటికల్ గా స్ట్రాంగ్ బాక్గ్రౌండ్ కూడా లేదు కానీ గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యే గా పోటీ చేసి ఆమె గెలుపొందారు.అయితే రజిని పొలిటికల్ ఎంట్రీ ఎంతో ఆసక్తికరంగా సాగింది.1990 జూన్ 24 న తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దుర్గిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో జన్మించిన రజిని సికింద్రాబాద్ మల్కాజ్ గిరిలోని సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది .అనంతరం కర్ణాటకలోని చిత్ర దుర్గంలోని జెఎంఐ ఇంజనీరింగ్ కాలేజీలో బిఈ పట్టా పొందింది.చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా వుండే రజిని చదువు పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేసారు.అదే సమయంలో ఆమెకు విడదల కుమారస్వామితో వివాహం జరిగింది.వీరిద్దరి జంటకు ఇద్దరు పిల్లలు కూడా వున్నారు.వీరు అమెరికా లో స్థిర పడ్డారు.అక్కడే సాఫ్ట్ వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉపాధి కల్పించారు.ఆర్ధికముగా బాగా స్థిర పడ్డ ఆమె తిరిగి స్వదేశానికి వచ్చి ప్రజా సేవ చేయాలనీ భావించారు.ఆమె నిర్ణయాన్ని భర్త కుమారస్వామి ఎంతగానో సపోర్ట్ చేసారు.
2014 రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చాలా మంది ఎన్ఆర్ఐ లు టీడీపీకి సపోర్ట్ గా నిలవడంతో రజిని కూడా టీడీపీకి సపోర్ట్ చేసింది.విడుదల రజిని ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీ లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి అయిన ప్రత్తిపాటి పుల్లరావును ఆమె రాజకీయ గురువుగా భావించింది. అలాగే నిత్యం ప్రజలలో మమేకం అవుతూ ఆమె స్థాపించిన విఆర్ ఫౌండేషన్ ద్వారా పేద వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చింది..ఆమె టాలెంట్ గుర్తించిన పుల్లారావు 2017 లో విశాఖపట్నంలో జరిగిన మహానాడు సభలో చంద్రబాబుకు పరిచయం చేసారు. అలాగే మొదటి సారి  మహానాడు సభలో రజిని చేసిన ఒక్క ప్రసంగం చంద్రబాబుతో సహా తెలుగు ప్రజానీకం అంతా కూడా ఆశ్చర్యపోయారు.హైదరాబాద్ లోని సైబరాబాద్ లో మీరు నాటిన ఒక మొక్కను అంటూ ఆమె స్పీచ్ అదరగొట్టింది.ఇలా ప్రజలలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

అయితే 2019 ఎన్నికలలో రజని తనకు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది.కానీ టీడీపీ నేత చంద్రబాబు అందుకు అస్సలు ఒప్పుకోలేదు.సీనియర్ నేత పుల్లారావును కాదని తనకి సీటు ఇవ్వలేనని ఆయన తేల్చి చెప్పారు..దీనితో ఆమె తన గురువుని సైతం ఎదిరించి వైసీపీ లో చేరారు.రజిని క్రేజ్ చూసిన జగన్ స్థానికంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మర్రి రాజశేఖర్ ను కాదని రజనికి టికెట్  కేటాయించారు..ఎమ్మెల్యే టికెట్ పొందిన రజిని విస్తృతంగా ప్రచారం చేసి అలాగే స్థానిక సమస్యలను ఎంతో అవగాహన చేసుకుంది.ఎమ్మెల్యే గా  గెలిపిస్తే పెండింగ్ లో వున్న ప్రతి పని పూర్తి చేస్తామని ఆమె తెలిపారు.అలా ఆమె ప్రత్తిపాటి మోసాలు కూడా ప్రచారం చేసింది. దీనితో స్థానిక ప్రజలు ఆమెను గెలిపించారు..అంతే కాకుండా ఎమ్మెల్యే అయిన మొదటి సారికే ఆమె మంత్రి పదవి అందుకుంది

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మాత్యులుగా ఆమె పని చేసారు.ఇలా ఆమె రాజకీయ జీవితం ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు కొనసాగింది.అయితే మంత్రిగా ఆమెపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. గ్లామర్ కి తప్ప ప్రజలకు ఇంపార్టెన్స్ ఇవ్వదని ఆమెపై వదంతులు ఏర్పడ్డాయి. దీనితో సామజిక సమీకరణాల దృష్ట్యా రజిని ఈ సారి ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది..అయితే రాష్ట్రంలో వైసీపీ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో 2024 ఎన్నికలలో రజిని భారీ మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: