శ్రీ రెడ్డీ: కేసు నమోదు పై.. స్పందించిన నటి..!

Divya
నటి శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలను సృష్టిస్తుందా రాజకీయాల్లో కూడా అంతే వివాదాలు సృష్టించేలా చేస్తూ ఉంటుంది. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు కూడా అంతే రచ్చ చేస్తోంది శ్రీరెడ్డి. తాజాగా నటి శ్రీరెడ్డి పైన కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు అయినట్టుగా నిన్నటి నుంచి వైరల్ గా మారుతోంది. కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈమె పైన టిడిపి నేత రాజు యాదవ్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత వీరి పైన శ్రీ రెడ్డి అసభ్య పదజాలతో దూషించినట్లుగా ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియా వేదికగా శ్రీరెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేసింది అంటూ ఫిర్యాదుల తెలియజేసినట్లు  కేసు నమోదు చేయాలని తెలిపారు. ఏపీ ఎన్నికల ముందు శ్రీరెడ్డి చేసిన వాఖ్యల పైన కూడా ఈ కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. టిడిపి నేతలను కించపరిచేలా శ్రీరెడ్డి మాట్లాడింది అంటూ కూడా రాజు యాదవ్ మీడియా ముఖంగా తెలియజేశారు.. ఆమె చేస్తున్న పని సరైనది కాదు అంటూ ఫైర్ అయ్యారు. ఈమెను చూసుకొని మరికొంతమంది ఇలాగే నేర్చుకునే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించారు.

దీంతో కచ్చితంగా శ్రీ రెడ్డిని అరెస్టు చేయాలని ఆమె పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు శ్రీరెడ్డి. అప్పట్లో టాలీవుడ్ నటుల పైన కూడా పలు రకాల ఆరోపణలు చేసి ఒక్కసారిగా వైరల్ గా మారింది.. అయితే ఈ కేసుల విషయం పైన శ్రీ రెడ్డి స్పందిస్తూ కడప హైదరాబాద్ కర్నూలులో నామీద కేసులు అంట ఎంజాయ్ టిడిపి బ్యాచెస్ అంటూ శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో ఒక పోస్టుని షేర్ చేసింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు వైసీపీ కార్యకర్తలు టిడిపి పెట్టిన కేసులపై ఆమె రియాక్షన్ ఇదే అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: