గెలుపు ఎవరిదైనా.. నిప్పుల నడకే.. కుర్చీ ఎవరిదైనా స‌వాళ్ల సంసారమే..!

lakhmi saranya
ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరు పాలన పగ్గాలు చేపడతారు? అనేది ఆసక్తిగా మారింది. ప్రజలు దీనికి సంబంధించి తీర్పు చెప్పేశారు. తమను పాలించే వారిని ఎన్నుకున్నారు. కేవలం ఫలితం మాత్రమే వేచి ఉంది. అది జూన్ 4 న రిలీజ్ కానుంది. జూన్ 9 నుంచి రాష్ట్రంలో కొత్త పాలన ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి ఏపీలో పాలన అంతా ఈజీ అయితే కాదని అంటున్నారు పరిశీలకులు.
దీనికి కారణం అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. ఇంట.. బయట.. కూడా ఏపీ పాలకులు.. ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉందని పరిశీలకులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ప్రతిపక్షాలు చెబుతున్నట్టు 12 లక్షల కోట్ల అప్పులు ఏపీ భరిస్తోంది. దీనికి వడ్డీలు కట్టాలి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలకు ఇప్పుడు విత్తనాలు వేసినా.. అవి మొలకెత్తడానికి రెండేళ్ల అయినా పడుతుంది. అప్పటివరకు ఎదురీతతప్పదు. అప్పులకు వడ్డీలు కోరుతూ.. కొత్త అప్పులు చేస్తే.. మరింతగా భారం పెరుగుతుంది.
ఇచ్చిన హామీలను అమలు చేయడం పార్టీలకు మరింత సంకటంగా మారింది. వైసీపీ వస్తే కొంతలో కొంత.. మెరుగ అయినా కూటమి వస్తే ఫ్యూచర్లో వైపు నుంచి ప్రతి నెల మహిళలకు మరియు విద్యార్థులకు.. ఇతర త్రా పథకాలు ఆర్టీసీ ప్రయాణం వంటివి భారీ సెగ పెట్టడం ఖాయమని అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. రాష్ట్రంలో కూటమి ప్రకటించిన సంక్షేమ పథకాలకు కేంద్రం నుంచి విధులు వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు.
పైగా ఉచితాలు తగ్గించుకోవాలని కేంద్రమే చెప్తుంది. మరో కీలక విషయం.. జూన్ 2 తో ఉమ్మడి హైదరాబాద్ కాలం చెల్లుతుంది. అదేవిధంగా విభజన చట్టం లోని పలు వివాదాలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంది. వీటిని తెలంగాణతో ముడి పెడుతూ.. కేంద్రం అనేక సందర్భాల్లో చేతులు ఎత్తేసింది. సో ఇది పరిష్కరించాల్సి రావడం.. పెద్ద సమస్య. వీటన్నిటితోడు.. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన వంటివి కొత్త ప్రభుత్వానికి ఇబ్బందే. ఈ విషయంలో గుప్పెడు హామీలు ఇచ్చిన కూటమికి అసలు హామీలు ఇవ్వని జగన్కు కూడా ఇబ్బందులు తప్పవు. సో ఎలా చూసుకున్నా.. కుర్చీలో కూర్చున్న వారికి సవాల సంసారమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: