జగన్ వాళ్లను కూడా వదల్లేదా.. తలపట్టుకుంటున్న పవన్?
బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని పవన్ కల్యాణ్ అధికారులను ప్రశ్నించారు. అలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. గ్రామాల వారీగా చేపట్టిన పనుల వివరాలు స్థానిక ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు. పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.