రవీంద్ర జడేజా: అంతర్జాతీయ టీ20లకి వీడ్కోలు?

Purushottham Vinay
రవీంద్ర జడేజా: అంతర్జాతీయ టీ20లకి వీడ్కోలు?  

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ విజయంతో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు భారత సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.అయితే అంతర్జాతీయ టీ20 సగటు, టీ20ల్లో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డుల విషయంలో విరాట్ కోహ్లీ టాప్‌ ప్లేస్ లో ఉన్నాడు.విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్‌తో టీ20ల్లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లకు మొత్తానికి లైన్ క్లియర్ అయ్యింది. వీరి రిటైర్మెంట్ తో జింబాబ్వే టూర్‌ నుంచి టీ20ల్లో కొత్త శకం మొదలు కానుంది. మరో షాకింగ్ విషయం ఏమిటంటే టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా కూడా  రిటైర్మెంట్ పలికాడు.


మేటి ఆల్‌రౌండర్ అయిన రవీంద్ర జడేజా రోహిత్, కోహ్లీ లాగే టీ20లకు బై బై చెప్పేశాడు.2009 వ సంవత్సరంలో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రవీంద్ర జడేజా, వన్డే, టెస్టుల్లో మంచి ప్లేయర్‌గా ఎదిగాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం జడేజా పర్ఫామెన్స్ అంతగా లేదు.. 14 ఏళ్ల టీ20 కెరీర్‌లో మొత్తం 74 మ్యాచులు ఆడిన రవీంద్ర జడేజా కేవలం 21.46 సగటుతో 515 పరుగులు చేశాడు. కనీసం ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.బౌలింగ్‌లో అయితే మొత్తం 54 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కూడా ధారాళంగా పరుగులు ఇస్తున్నా.. రవీంద్ర జడేజాకి మాత్రం బౌలింగ్ ఇచ్చేందుకు ధైర్యం చేయలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. అందరి కంటే ఆలస్యంగా బౌలింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌ వేసి ఏకంగా 12 పరుగులు ఇచ్చాడు.  జడేజాకి కనుక మరో ఓవర్ ఇచ్చి ఉంటే, టీమిండియా చేతుల్లో నుంచి మ్యాచ్ చేజారిపోయే అవకాశం ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: