కుప్పం: ప‌రిగెడుతోన్న పోలింగ్ ప‌ర్సంటేజ్‌.. బాబుకా? భ‌ర‌త్‌ కా?

Purushottham Vinay
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయ్యింది. మే 13వ తేదీ అనగా నేడు ఉదయం 7 గంటలకు ఓటింగ్  మొదలవ్వగా..వేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పోలింగ్ బూత్ లకు వచ్చారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఓటర్ల జాతర సాధారణంగా లేదనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద తిరనాళ్ల సందడి బాగా నెలకొందనే చెప్పాలి. పోలింగ్ బూత్స్ వద్ద ఎన్నో వందల మంది ఓటర్లు క్యూలో కనిపించారు. అసలు పోలింగ్ బూతుల దగ్గర పురుషులు కంటే మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించటం విశేషం అని చెప్పాలి.అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వేల సంఖ్యలో ఒకేసారి తరలిరావటంతో పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. జన జాతరా.. ఓటర్ల జాతరా అన్నట్లు పోలింగ్ బూతుల వద్ద ఓటర్ల వాతావరణం నెలకొంది. ఇలా చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఓటర్ల వాతావరణ పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం పూట ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం గొప్ప విషయం.


రాష్ట్రంలోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక కుప్పంలో అయితే ఓటర్ల సందడి మాములుగా లేదు. కీలక నియోజకవర్గం కావడంతో చాలా హోరా హోరీగా పోలింగ్  జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ కంటే వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని అక్కడ ఓట్లు వేస్తున్న జనాల నుంచి ఇండియా హెరాల్డ్ ప్రతినిధులకు సమాచారం తెలుస్తుంది. కుప్పంలో టీడీపీ జెండా కంటే ఫ్యాన్ గాలి బలంగా వీస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అక్కడి జనాలు టీడీపీ  కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి ఇంకా పార్టీ నేత భరత్ వాగ్దానాలు ఇంకా గతంలో జనాలకు చేసిన మంచి పనుల వల్ల వైసీపీకి కుప్పంలో జనాలు బ్రహ్మరథం పడుతూ ఓట్లు వేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఈ ఓట్లతో కుప్పంలో ఖచ్చితంగా భరత్ బాబు మీద భారీ పర్సెంటేజ్ తో గెలవడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: