ఏపీ: నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత.. ఈసారి ఓడిపోయినట్టేనా..?
సాధారణంగా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చివరి రౌండు ఓట్లు విప్పేదాకా తేలదు. అంటే చిన్న తేడా వచ్చినా రోజా ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఈసారి రోజా కి పోటీగా టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ రంగంలోకి దిగారు. పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతున్న వేళ టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం అనేది బాగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడి ప్రజలు వైసీపీ తమకు మంచి చేయలేదని భావనలో ఉన్నారు. ఇక రోజాపై ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజలను మరింత దూరం చేశాయని అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో 2,01,607 ఓట్లు ఉన్నాయి. వారిలో చాలామంది రోజాకి వ్యతిరేకంగానే ఉన్నారని సమాచారం. 2014లో రోజాపై గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ చేసి కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో వైసీపీ వేవ్ కారణంగా రోజా ప్రత్యర్థి గాలి భాను ప్రకాష్ పై సుమారు మూడు వేల ఓట్లతో గెలుపొందారు. ఈ విధంగా చూసుకుంటే రెండు ఎన్నికల్లో కూడా ఆమె చాలా స్వల్ప తేడాతో విజయం సాధించారు. రోజా ఎంపీ అయ్యాక సోదరులు కుమారస్వామి రెడ్డి, రామ ప్రసాద్ రెడ్డి, భర్త సెల్వమని పెత్తనాలు బాగా పెరిగిపోయాయట. మీరు ప్రతి పని కోసం కమిషన్లు లంచాలు పుచ్చుకుంటున్నారట. ఈ విషయాలను సొంత పార్టీ వాళ్లే బహిరంగంగా బయట పెడుతూ విమర్శిస్తున్నారు. ఈ ధోరణి వల్ల ఆ రోజాకి ఈసారి ఓటమి తప్పదు అని అంటున్నారు. మరి ఎవరు ఓడిపోతారో చూడాలి.