ఏపీ : ఎన్నికల వేళ.. చంద్రబాబుకు వాళ్ల ఉసురు తగులుతుందా?
అయితే టిడిపి చేసిన ఈ పనిని అటు వైసిపి తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఏకంగా వృద్ధులను ఇబ్బంది పెట్టేందుకే టిడిపి ఇలా వాలంటీర్లు పెన్షన్లు పంచకుండా ఆపేందుకు ప్రయత్నించిందని వైసిపి ఆరోపిస్తుంది. ఇంకోవైపు తాము ప్రభుత్వ పథకాలను ఆపాలని చెప్పలేదని.. వాలంటీర్ల జోక్యం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని మాత్రమే చెప్పాము అంటూ టిడిపి కూటమి చెబుతోంది. ఇక ఇదే విషయంపై ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి.
కాగా ఇదే విషయం గురించి అటు మాజీ మంత్రి, వైసిపి కీలక నేత మంత్రి పేర్ని నాని స్పందించాడు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు వద్దని.. ఈసీకి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ టిడిపి సానుభూతిపరుడు కాదా అంటూ చంద్రబాబును ప్రశ్నించాడు మంత్రి పేర్ని నాని. ప్రజల నుంచి తిరుగుబాటు రావడంతో ఇప్పుడు చంద్రబాబు మాట మార్చాడు అంటూ విమర్శించాడు. వృద్ధులు వితంతువుల ఉసురు పోసుకొని చంద్రబాబు బాగుపడతాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రను విషపు కూటమి చేస్తుంది అంటూ ఆరోపించాడు మాజీ మంత్రి పేర్ని నాని. అయితే ఇలా పెన్షన్ల కంపెనీలో వాలంటీర్ల జోక్యం లేకుండా చేయటంలో సక్సెస్ అయిన చంద్రబాబుకు ఇది కలిసి వస్తుందా మైనస్ అవుతుందో చూడాలి.