సోనూసూద్కు మళ్లీ మళ్లీ ప్రభుత్వ నోటీసులు....!
ఇప్పుడు తాజాగా సోనూసూద్ను మరోసారి చిక్కుల్లో పడేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. ముంబయి మహానగరం జుహూ ప్రాంతంలో సోనూసూద్కు ఓ హోటల్ ఉంది. ఇప్పుడ ఆ హోటల్కు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది జులై నెలలో తొలిసారి సోనూసూద్కు బీఎంసీ అధికారులు నోటీసు ఇచ్చారు. జుహూలోని హోటల్ను నివాస భవనంగా మార్చాలని.... అలాగే అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాలని కూడా తమ నోటీసుల్లో బీఎంసీ పేర్కొంది. దీనికి సోనూసూద్ కూడా వివరణ ఇచ్చారు. భవనాన్ని తానే పునరుద్ధరిస్తానంటూ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ పనులను సోనూ పూర్తి చేయలేదు. ఆరు అంతస్తుల భవనాన్ని నివాస సముదాయంగా ఇంకా మార్చలేదంటూ నోటీసులో ప్రశ్నించింది. ప్రణాళిక ప్రకారం నివాసితులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని... హోటల్ కార్యకలాపాలను నిర్వహించరాదంటూ నోటీసులో పేర్కొంది. దీనికి సోనూ వివరణ ఇచ్చారు. ఇప్పటికే భవనంలో హోటల్ రద్దు చేశామని... త్వరలోనే డాక్యుమెంటేషన్ పని పూర్తి చేసి బీఎంసీకి సమర్పిస్తామన్నారు.