నాగబాబు: జగన్ మద్దతు పెంచేస్తున్నాడే.. మారరా..!

Divya
రాయలసీమలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా ప్రత్యర్ధులు కామెంట్స్ చేస్తున్నారు.. కేవలం జగన్ పైన ద్వేషంతోనే ఆయన కించపరిచేలా ప్రత్యర్థులు చేస్తూ ఉన్నప్పటికీ ఇదే కూటమిపాలిట శాపంగా మారుతున్నది.. జగన్ పులివెందల కడప రాయలసీమ బిడ్డని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నారని రెండు రోజుల క్రితమే వెల్లడించారు.. పులివెందుల కల్చర్ అంటే ఒక నమ్మకం, ధైర్యం ,పోరాడే తత్వం సక్సెస్ఫుల్ అంటూ కూడా చాలా గర్వంగా చెప్పుకొచ్చారు.

అయితే ప్రత్యర్ధులు మాత్రం కేవలం కడప రాయలసీమ పులివెందల  అంటే రౌడీల కల్చర్ అంటూ నానారకాలుగా విమర్శిస్తున్నప్పటికీ వారందరికీ అదిరిపోయే కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు జగన్. దీంతో  రాయలసీమలో కాస్త అభిమానం పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే జగన్ను కించపరచడానికి మరొకసారి ఆ ప్రాంతం పైన జనసేన నాయకుడు విషం చిమ్ముతున్నట్లు కనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళితే నాగబాబు తన ట్విట్టర్ వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో రాయలసీమ వాసులకు కోపం తెప్పించేలా కనిపిస్తోంది.

కడప నుంచి రౌడీలని పంపించారు పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి కుట్ర జరుగుతోంది.. అందులో ఎంపీ మిధున రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా లాంటి కొందరు పాత్ర కూడా ఉందని మాకు సమాచారం అందింది అంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పలు రకాల ఆరోపణలతో ఒక వీడియోని షేర్ చేశారు. అయితే ఇలాంటి వీడియోలు అటు టిడిపి జనసేన పార్టీకి కాస్త సంతోషాన్ని ఇచ్చిన రాయలసీమ వాసులకు మాత్రం రౌడీలుగా చిత్రీకరించడంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని విధంగా తెలియజేస్తున్నారు. కేవలం జగన్ పైన ఉండే కోపంతోనే రాయలసీమ పైన ఇలాంటి సాంస్కృతిక దాడులు చేస్తున్నారని రాయలసీమ నేతలు ప్రజలు కూడా ఫైర్ అవుతున్నారు. అయితే ఇలాంటి విషయాలను ప్రత్యర్థులు గ్రహించకుండా కేవలం రాయలసీమ ప్రజలను ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటున్నారనే వాదన వినిపిస్తోంది.రాబోయే రోజుల్లో ఇలాంటి విషయాలలో రాయలసీమ పేరు వినిపించకుండా ఉంటేనే మంచిదంటూ ప్రజలతో  పాటు ,జనసేన కార్యకర్తలు కూడా  నాగబాబుని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: