బాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు.. ప్రూఫ్ ఇదే!

Anilkumar
బాలీవుడ్ అగ్ర జంట రన్వీర్ సింగ్ - దీపికా పదుకొనె విడాకులు తీసుకోబోతున్నారా? ప్రస్తుతం బీ టౌన్ లో దీని గురించే చర్చ జరుగుతుంది. ఈ డిస్కషన్ జరగడానికి ఓ కారణం కూడా ఉంది. ఆ కారణం రణ్ వీర్ సింగ్ కావడం గమనార్హం. డీటెయిల్స్ లోకి వెళ్తే..
రణ్ వీర్, దీపికా బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అందుకు కారణం రణ్ వీర్ సింగ్ ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడమే. దీంతో అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి.
ఈ మధ్య స్టార్ సెలెబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫోటోలు డిలీట్ చేసారు. తాజాగా రణ్ వీర్ ఏకంగా పెళ్లి ఫొటోలే డిలీట్ చేయడంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీపికా పదుకొనె మాత్రం పెళ్లి ఫోటోలు డిలీట్ చేయలేదు. మరోవైపు రణ్ వీర్ ఇన్ స్టా ఖాతాలో కేవలం పెళ్లి ఫోటోలు మాత్రమే డిలీట్ అయ్యాయి. దీపికతో కలిసున్న పిక్స్ మాత్రం అలాగే ఉన్నాయి.
దీంతో ఏదో పొరపాటులో పెళ్లి ఫోటోలు డిలీట్ అయ్యి ఉంటాయని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దానికి తోడు దీపికా ఇప్పుడు ప్రెగ్నెన్సీ తో ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి టైం లో బాలీవుడ్ అగ్ర జంట రన్వీర్ సింగ్ - దీపికా పదుకొనె  జంట డివోర్స్ తీసుకోవడం ఏంటని? అది నిజం కాదని అభిమానుల వాదన. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే రణ్ వీర్, దీపికా ఇద్దరిలో ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: