"ఓదెల 2" షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నా తమన్నా..!

Pulgam Srinivas
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో ఓదెల రైల్వే స్టేషన్ అనే మూవీ కొంత కాలం క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజిత పొన్నాడ , వశిష్ట ఎన్. సింహ , సాయి రోనక్ ముఖ్య పాత్రలో నటించగా ... అశోక్ తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శకుడు అయినటువంటి సంపత్ నంది ఈ మూవీ కి కథను అందించాడు. ఈ మూవీ 2021 వ సంవత్సరం థియేటర్ లలో కాకుండా నేరుగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

పెద్దగా అంచనాల లేకుండా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో నేరుగా విడుదల అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ మూవీ లోని నటనకు గాను హెబ్బా పటేల్ కు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి కొనసాగింపుగా "ఓదెల 2" అనే మూవీ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో కూడా హెబ్బా పటేల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సంపత్ నంది ఈ మూవీ కి కథను అందించాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ హైదరాబాదులో తమన్నా పై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ కి మంచి ప్రేక్షక ఆదరణ దక్కడంతో "ఓదెలా 2" మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయి లో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: