ఆడుకోండి మీరు జగనూ బాబులూ!
వాస్తవానికి ఆరోజు అమరావతిని రాజధానిగా ప్రకటించగానే ప్రజలకు అభ్యంతరం లేకపోతే మాకూ అభ్యంతరం లేదనే చెప్పారు జ గన్. తరువాత పాదయాత్రలోనూ అమరావతే రాజధాని అని దీనిని మార్చే ఉద్దేశమే తమకు లేదని కూడా చెప్పారు. పునరుద్ఘా టించారు. కానీ అధికారంలోకి రాగానే ప్రాంతీయ అసమానతల నివారణకు అన్ని ప్రాంతాలకూ సమాన రీతిలో సమాన అవకాశాలు అభివృద్ధి అన్నవి దక్కేలా తాము మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నామని చెప్పి ఓ సంచలనం అయ్యారు జగన్. దీనిని ఎవ్వరూ కాదనరు.
ఓ విధంగా కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని చంద్రబాబు అభివృద్ధి చేశారన్న అక్కసుతోనే ఆయన ఈ పొలిటికల్ డ్రామాకు తెరలేపారని చాలా మంది పైకి చెప్పారు. ఆ రోజు చంద్రబాబు హయాంలో రెడ్లకు ఎదిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆ అక్కసుతోనే కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం పెరిగిందన్న అక్కసుతోనే 29 గ్రామాల సమస్యను పట్టించుకోనవసరం లేదని జగన్ ఓ విధంగా పెద్ద తతంగమే నడిపారు. ఫలితంగా ఈ ఆటలో ఓడిపోయిన ప్రజలకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. ఆ రోజు జగన్ ఓడారు ఇప్పుడు చంద్రబాబు ఓడారు మొత్తంగా ఆయననో ఈయననో ఎన్నుకున్న పాపానికి ప్రజలు ఓడారు. వాళ్లే రోడ్డున పడ్డారు. లాఠీ దెబ్బలు తిన్నారు. మూడు పంటల నేలను చేజేతులారా నాశనం చేసుకున్నారు. అవును ఈ పాపం ఆ ఇద్దరిదీ కాదు ఆ ఇద్దరికీ వర్తిస్తుంది. మూల్యం చెల్లింపు అన్నది కాలం నిర్ణయిస్తుంది. పరిహారం ఎంతన్నది కూడా కాలమే నిర్ణయిస్తుంది.