హుజుర్ పోరు : గొడ మీద పిల్లులకు డిమాండ్
ఈ సమస్య ను ప్రస్తుతం ప్రధాన పార్టీలు అయిన టీఆర్ ఎస్ బీజేపీ కాంగ్రెస్ లు ఎదుర్కొంటున్నాయి. ముందుగా టీఆర్ ఎస్ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేంధర్ బీజేపీ లో ఆయన కు సన్నిహితంగా ఉండే కొంత మంది ఇంకా టీఆర్ ఎస్ లోనే ఉన్నారు. అలాంటి వారు టీఆర్ ఎస్ పార్టీ రహస్యంగా తీసుకుంటున్న నిర్ణయాలను బయటకు చెబుతున్నారు. అలాగే బీజేపీ లో నుంచి పెద్ద రెడ్డి కాంగ్రెస్ లో నుంచి కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ చేరారు. వారికి సన్ని హితంగా ఉండే వాళ్లు ఆయా పార్టీ లో నే ఉండి పోయారు. దీంతో ఈ ఉప ఎన్నికల కు సంబంధించి ఆయా పార్టీ లు తీసుకుంటున్న నిర్ణయాలను లీక్ చేస్తున్నారు. దీంతో ఈ మూడు పార్టీలలో ఎవరు ఎలాంటి వారు ఉన్నారో తెలుసు కోవడానికి నాయకులకు కష్టం గా మారిందట. దీంతో రహస్య నిర్ణయాలను పంచు కోవడానికి నాయకులు జంకుతున్నారని సమాచారం.