పెట్రో మంట : తప్పు ఎవరిది కేంద్రానిదా? రాష్ట్రానిదా?
అయితే ఇలా పెట్రోల్ డిజిల్ ధరలు విపరీతం గా పెరుగుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించ కుండా నిమ్మకు నీరేత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అంతే కాకుండా ఒకరి పై ఒకరు విమర్శ లు చేసుకుంటు ప్రజల ను తప్పు దారి పట్టి స్తున్నారు. కేంద్ర లో మోడీ ప్రభుత్వం రాక ముందు లీటర్ పెట్రోల్ పై కేంద్ర పన్ను రూ. 9.20 గా ఉండేది. 2014 తర్వాత మోడీ అధికారంలో కి వచ్చిన తర్వత పెట్రోల్ డిజిల్ గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చాయి. దీని కారణం ప్రతి లీటర్ పెట్రోల్ పై కేంద్ర విధించే పన్నును విపరీతంగా పెంచడమే అని చెప్పాలి. ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ పై కేంద్ర విధించే పన్ను అక్షరాల రూ.32.90 కి పెంచేసింది. మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అంటే గత ఏడేళ్లలో కేంద్రం పన్ను ఒక లీటర్ పై దాదాపు 258 శాతం పెంచేసింది. దీని వల్లనే పెట్రోల్ డిజిల్ ధరలు కొండేక్కి పోతున్నాయని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. అయితే పన్నులు విధించడం లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తక్కువేమీ కాదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టేట్ వ్యాట్ తో పెట్రోల్ డిజిల్ పై బాగానే వడ్డిస్తున్నారు. చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా పన్ను ల పేరు తో పెట్రోల్ డిజిల్ ధరల పెరుగుదల కు కారణం అవుతున్నాయి.