యశ్ సినిమా నుంచి తప్పుకున్న కరీనా కపూర్..!!

murali krishna
కేజిఎఫ్ సినిమాతో.. ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్నారు కన్నడ స్టార్ యష్. ప్రస్తుతం యశ్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పేరు అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు సినిమాల్లో కనిపించక పోయిన యాడ్ లలో కనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. దాదాపుగా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణించింది.. ప్రస్తుతం 'దిక్రూ' చిత్రంలో నటించింది.. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ నటిస్తున్నారు.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..
ఇక కరీనా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది.. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయాన్ని తానే స్వయంగా చెప్పుకొచ్చింది.. త్వరలోనే ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నా.. ఓ స్టార్‌ హీరో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో నటించనున్నాను. సౌత్‌లో నాకిది ఫస్ట్‌ మూవీ. షూటింగ్‌లో పాల్గొనే టైమ్‌ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది.. కానీ ఇప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్నదని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కరీనా కపూర్ మాత్రం డేట్స్ కుదరడం లేదంటూ ఈ టాక్సిక్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ఆమె తప్పుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని నెలలుగా మేకర్స్ ప్రీప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నారు తప్ప మూవీలో నటించబోయే వాళ్ల గురించిగానీ ఇతర సమాచారం ఏదీ ఇవ్వలేదు.కేజీఎఫ్ లాంటి ఫ్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన యశ్ నెక్ట్స్ మూవీపై ఈ స్థాయిలో గందరగోళం నెలకొనడం ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ సినిమాను కేవీఎన్ బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. కానీ ఇప్పుడు కరీనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న వార్తలు మాత్రం వాళ్లను ఆనందానికి గురి చేస్తోంది.
దీనిపైనా టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. గతేడాది డిసెంబర్లో టైటిల్ లాంచ్ తప్ప ఇప్పటి వరకూ అప్డేట్స్ ఇవ్వలేదు.. కరీనా వేరే సినిమాలు ఉండటం తో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.. దీనిపై క్లారిటి రావాల్సి ఉంది..ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. గ్యాంబ్లింగ్ అండ్ హీస్ట్ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని 2025 ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్లు కూడా నిర్మాతలు ప్రకటించేసారు. మరి కేజీఎఫ్ తో భారీ స్టార్‌డమ్ ని సంపాదించుకున్న యశ్.. ఈ సినిమాతో తన ఆడియన్స్ ని సంతృప్తి పరుస్తాడో లేదో చూడాలి.
ఇది ఇలా ఉంటే, యశ్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణంలో కూడా నటిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తుంటే యశ్ రావణాసురుడు పాత్రలో కనిపించబోతున్నారట. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: