జ్యోతికృష్ణ పై మోయలేని బాధ్యత !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ క్షణం తీరికలేకుండా ఆంధ్రపర్యదేశ్ ఎన్నికలలో ప్రచారం చేస్తున్న నేపధ్యంలో ఎన్నికల ఫలితాల పై అన్ని వర్గాలలోను తీవ్ర ఆశక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం తెలుగు ప్రజలు అంతా ఎన్నికల మూడ్ లో ఉండటంతో జనం సినిమాల గురించి పట్టించుకోవడంలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ కు సంబంధించిన కొత్త టీజర్ విడుదల అవ్వడం పవన్ అభిమానులకు ఆశ్చర్యంతో పాటు జోష్ ను కలిగించింది.

ఇప్పటివరకు ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నది  క్రిష్ అని భావించిన వారికి ఊహించని విధంగా ఈమూవీ దర్శకత్వ బాధ్యతలను జ్యోతికృష్ణ కు అప్పచెప్పినట్లు వచ్చిన ప్రకటన చూసి చాలామంది ఆశ్చర్య పడితే పవన్ అభిమానులు మాత్రం విపరీతంగా ఖంగారు పడుతున్నారు. దీనికి కారణం ఈమధ్య కాలంలో అతడు తీసిన సినిమాలు చాలమటుకు ఫెయిల్ అవ్వడం.

లేటెస్ట్ గా అతడు దర్శకత్వం వహించిన ‘రూల్స్ రంజన్’ ఫెయిల్ అయింది. ఆమధ్య గోపీచంద్ తో తీసిన ‘ఆక్సిజన్’ మూవీ భయంకరమైన ఫ్లాప్. గతంలో అతడి తమ్ముడు రవికృష్ణతో చేసిన ‘కేడి’ మూవీ కూడ ఫెయిల్ అయింది. ఆమధ్య అతడే హీరోగా నటించిన ‘ఊలలలా’ మూవీ కొంతకాలం క్రితం విడుదలై ఫెయిల్ అయింది.

అలాంటి ఫెయిల్యూర్ ఇమేజ్ ఉన్న జ్యోతికృష్ణ ‘హరిహర వీరమల్లు’ ను ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అన్న సందేహాలు పవన్ అభిమానులకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూవీ నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ పై ఉన్న నమ్మకంతో ఈమూవీ ప్రాజట్ పై చాల భారీ స్థాయిలో ఇప్పటికే ఖర్చు పెట్టాడు అన్న వార్తలు ఉన్నాయి. పవన్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ పై దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నారు అన్న వార్తలు ఉబ్బాయి. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి క్రిష్ స్థానంలో వచ్చిన దర్శకుడు జ్యోతికృష్ణ పై మోయలేని భారం ఉంది అంటూ పవన్ అభిమానులు తమలో తాము కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: