చేతిలో చిల్లిగవ్వ లేక కట్టుబట్టలతో ఒక కుటుంబం రోడ్డుమీదికి వస్తే వారి బాధ వర్ణించడం చాలా కష్టం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉపాధి కోల్పోయినటువంటి వలస కార్మికుడు తాజాగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గత కొంత కాలంగా ఆదాయం ఏమీలేక మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికుడు రమేష్ ఢిల్లీ నగరాన్ని విడిచి సొంత ఊరు అయినటువంటి బోపాల్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బు, అది కూడా ఆహారం కోసం దాచుకున్నాడు. భార్యను తీసుకొని కాలినడకన ఢిల్లీ నుంచి భూపాల్ రాష్ట్రానికి బయలుదేరాడు. ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. అక్కడ ఉన్న ఒక హాస్పటల్లో చేర్చేందుకు అతడి దగ్గర డబ్బులు లేకపోవడంతో స్థానిక జర్నలిస్టులకు అనే విషయం తెలిసింది.
దాంతో వారు చొరవ చూపి బాధితురాలికి వైద్య సాయం అందించారు. దీంతో విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఢిల్లీలో ఒక నిర్మాణ కంపెనీలో దినసరి కూలీగా రమేష్ పని చేస్తున్నాడు. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సమయంలో పని ప్రదేశంలో సూపర్వైజర్ కరోణ ఉధృతికి గురై చనిపోయాడు. ఆనాటి నుంచి రమేష్ కు ఉపాధి లేకుండా పోయింది. యజమాని పని ఇవ్వడం లేదు. దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బు కూడా అయిపోయింది. సొంత ఊరు బోపాల్ కి వెళ్ళాలి అంటున్నాడు. కేవలం ఏదైనా తినేందుకు మాత్రమే సరఫరా డబ్బులు దగ్గర ఉండడంతో భార్యతో కలిసి రమేష్ కాలినడకన భూపాల్ కి వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు.
ఎనిమిది రోజుల పాటు నడిచి .. నడిచే ఇద్దరు తీవ్రంగా అలిసిపోయారు. సరైన సమయానికి తిండిలేక రమేష్ భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ సమయంలోనే స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టుల సాయంతో హాస్పటల్ లో చేర్పించాడు. కరోణ సెకండ్ వేవ్ తో ఢిల్లీలో ఎంతో మంది ఉపాధి కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పవచ్చు. వీరి సంక్షేమం కొరకు పాలకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా బాధాకరం అని చెప్పవచ్చు.