ఏంటి.. ఆ ఒక ఫైట్ సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేశారా..!?

Anilkumar
హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా తన కెరీర్ ను ప్రారంభించిన నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా తన సత్తా చూపించాడు. యాక్షన్ సినిమాలతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరొక పిరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కార్తికేయ 2 సినిమాతో నార్త్ లోను క్రేజ్ సంపాదించుకున్నాడు నిఖిల్. కాగా ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ తో సినిమాలను తీస్తున్నాడు. అయితే ప్రస్తుతం నిఖిల్ ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా స్వయంభు. కొన్నాళ్లుగా ఈ

 సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువనశంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .కాగా ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటిని కలిగించాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీలో నిఖిల్ యోధుడిగా

 కనిపించనున్నాడు. త్వరలోనే ఈ కు సంబంధించిన మరిన్న వివరాలను అనౌన్స్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీపై మరింత హైప్ పెంచే విధంగా నిఖిల్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్సీషియన్స్ వర్క్ చేస్తున్నట్లు తెలిపాడు.  దాదాపు 700 మందితో 12 రోజులపాటు రూ. 8 కోట్లు పెట్టి ఈ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఒక్క ఫైట్ సీన్ కోసం ఏకంగా రూ. 8 కోట్లు పెట్టడం చూస్తుంటే ఈ ను ఈ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారో అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.  ఇప్పటికే కార్తికేయ 2, 18 పేజీస్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నిఖిల్.. ఇప్పుడు స్వయంభు చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: