అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?
ఇతర దేశాల కంటే ఎక్కువగా వ్యాక్సిన్లు వేసిన సీషెల్స్ ఇప్పుడు పాఠశాలలు, పార్కులు, పర్యటక ప్రదేశాలు, క్రీడా కార్యకలాపాలను రద్దు చేసింది. అలాగే బార్లను త్వరలో మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ దేశంలో ఉన్న జనాభాలో ఇప్పటి వరకు 60 శాతానికి పైగా టీకాలు వేసినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి పెగ్గి విడోట్ మీడియాకు వెల్లడించారు. ఈ దేశం ఎక్కువ భాగం పర్యాటక రంగంపై ఆధారపడి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి చైనా వ్యాక్సిన్ల విరాళాల ద్వారా జనవరిలో టీకాలు వేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 12 నాటికి మోతాదులో 59 శాతం సినోఫార్మ్ వ్యాక్సిన్లు, మిగితా కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా టీకాలను వేసింది. ఇప్పటి వరకు ఆ దేశ జనాభాలో 62.2 శాతం మందికి కోవిడ్ టీకాలు వేశారు. అయినప్పటికీ సెకండ్ వేవ్ లో ఇక్కడ కూడా కొత్త వేరియంట్ల వైరస్లను కనుగొన్నారు. గత ఏడాది చివర్లో గుర్తించిన బి.1.351 వేరియంట్ను ఫిబ్రవరిలో సీషెల్స్లో గుర్తించారు.