మద్యం మత్తు.. చేతిలో కత్తి.. చివరికి.?
వెరసి రోజురోజుకు ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని విచక్షణా రహిత జీవితాన్ని గడుపుతున్నారు ఎంతోమంది. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తు ఆ కొడుకుని ఉన్మాదిగా మార్చేస్తుంది. తన రక్తాన్ని పంచి భరించలేని నొప్పిని అనుభవించి జన్మనిచ్చిన ఆ తల్లి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసింది అన్న ప్రేమను కూడా మర్చిపోయాడు. మద్యం మత్తులో పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. చివరికి ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితి లోకి వెళ్ళిపోయి ఏకంగా మద్యం మత్తులో కత్తితో తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.
ఈ ఘటన వరంగల్ లో వెలుగులోకి వచ్చింది. పరకాల వికాస్ నగర్ లో కుటుంబ గొడవల కారణంగా తాగిన మైకంలో కత్తితో కన్న కొడుకు వీరంగం సృష్టించి చివరికి విచక్షణ రహితంగా తల్లిపై దాడి చేయడంతో సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రాజేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో కత్తితో విచక్షణారహితంగా దాడి చేయగా తల్లిదండ్రులతో పాటు ఐదు నెలల గర్భవతి అయిన సోదరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే తల్లి మృతి చెందింది ఇక మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.