ఈ నిమ్మగడ్డకు ఏమైంది.. చంద్రబాబు పూర్తిగా డిజప్పాయింట్..?
అంతేకాదు.. ఆ తర్వాత టీడీపీ ఇచ్చిన అనేక ఫిర్యాదులపైనా ఆయన పసలేదని తేల్చేశారు. పంచాయితీ ఎన్నికలు సజావుగా నిర్వహించామంటున్న నిమ్మగడ్డ..కౌంటింగ్ ప్రక్రియలో రెండంకెల ఫలితాలు వచ్చిన చోట కొన్ని తప్పులు జరిగాయని కంప్లైంట్లు వచ్చాయని.. కానీ.. అవేవీ నిజం కాదని తమ విచారణలో తేలిందని ప్రకటిస్తూ టీడీపీని పూర్తిగా డిజప్పాయింట్ చేసేశారు. కంప్లైంట్లపై కలెక్టర్లు, జిల్లా ఎలక్షన్ అధికారుల నుంచీ వివరణాత్మక నివేదికలు తెప్పించామని నిమ్మగడ్డ అంటున్నారు.
ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో ముఖ్యంగా నాలుగు చోట్ల కంప్లైంట్లపై రెండవసారి కూడా లోతుగా విచారణ చేశామని.. కలెక్టర్లు ఇచ్చిన వివరణలను ఎస్ఈసీ అంగీకరించిందని నిమ్మగడ్డ ప్రకటించారు. గుంటూరు జిల్లాలో పిడపర్తిపాలెం, వెనిగండ్ల, పెదకూరపాడు, పోతుమర్రు పంచాయితీల కంప్లైంట్ల విషయంలో పూర్తి సమాచారం సేకరించామన్నారు. రీపోలింగ్ నిర్వహించాల్సిన స్ధాయిలో తీవ్రమైన సంఘటనలు ఏవీ జరగలేదని తేల్చి చెప్పారు.
పూర్తి విచారణ అనంతరం ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగలేదని ఎస్ఈసీ ధృవీకరిస్తోందని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. అంటే.. రాష్ట్రంలో 12 కార్పొరేషన్లు,71 మునిసిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా.. ఎలాంటి అక్రమాలు జరగకుండా ముగిశాయని ఆయన ప్రకటించడమే కదా. చిన్నపాటి ఘటనలు మినహా ఎక్కడా తీవ్రమైన ఘటనలు చోటు చేసుకోలేదన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటనతో టీడీపీ శ్రేణులు ఎంతగా ఆవేదన చెంది ఉంటాయో..!