చంద్రబాబు కి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేసిన నరేంద్ర మోడీ..!

lakhmi saranya
దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన లీడర్. ఓ విజన్ ఉన్న నాయకుడు. అభివృద్ధి అజెండాతో ముందుకు వెళ్లే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఏపీ ప్రజలు సంకల్పించుకున్నారు. 2014లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి.. ప్రజా పాలన అందించడంలో విఫలమయ్యింది. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కక్ష గట్టింది. ప్రతి అంశం లోను చంద్రబాబును ఇబ్బంది పెడుతూనే వచ్చింది.
ఇక వైసిపి అరాచకాలకు విసుకు చెందిన చంద్రబాబు తాను సీఎం గానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శబదం చేశారు. ఈ ఎన్నికలలో టిడిపి భారీ విజయం సాధించడంతో చంద్రబాబు శపథం నెరవేరింది. భారీ మెజారిటీతో చంద్రబాబు 2024 ఎన్నికలలో గెలిచారు. ఈ సందర్భంగా నే పలువురు నాయకులు చంద్రబాబుకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ సైతం చంద్రబాబుకి ఫోన్ చేసి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశాడు. ఎప్పుడైతే కౌంటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే టిడిపికి భారీ మొత్తంలో మెజారిటీ రావడం మొదలైంది.
ఆ మెజారిటీ ఎక్కడా కూడా పడిపోకుండా అలానే కొనసాగింది. చివరికి అదే మెజారిటీతో భారీ విజయం సాధించాడు చంద్రబాబు. ఈ క్రమంలోనే మోడీ తనకి ఫోన్ చేసి స్పెషల్ విషెస్ తెలియజేశారు. టిడిపి అధికారంలోకి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారట. ఇక 2024లో బిజెపి, జనసేన, టిడిపి పొత్తు ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి ప్రజల మంచి కోసం పోరాటం చేశారు. ఎట్టకేలకు వారి సహకారం నెరవేరింది. మరి కొద్ది సేపట్లో ఓట్లు లెక్కింపు పూర్తి చేసుకుని అఫీషియల్ గా విజేతని ప్రకటించనున్నారు. నారా చంద్రబాబు అనే నేను.. అనే మాట కోసం టిడిపి అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: