రోజా పై షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..??

Suma Kallamadi
ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు, వైసీపీ మాజీమంత్రి రోజా ఈసారి నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వెలువడిన ఫలితాల్లో ఆమె పూర్తిగా వెనుకంజలో ఉన్నారు. ఇక ఆమె దాదాపు ఓడిపోయినట్లే. పుంజుకునే అవకాశం లేదు. ఈ సమయంలో సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఆర్కే రోజా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోజా ఫోటో షేర్ చేస్తూ "జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా" అంటూ ఒక ట్వీట్ చేశాడు.
ఇక ఓడిపోయావు కదా జబర్దస్త్ కి వెళ్లి కుప్పిగంతులు వెయ్యి అన్నట్లు అతను రోజాపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. రాజకీయంగా రోజా, బండ్ల గణేష్ మధ్య చాలా శత్రుత్వం  ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ఆ విమర్శలు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ ని దేవుడు గా భావించే బండ్ల గణేష్ రోజా అని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో పక్కలు వేస్తున్నావా నువ్వు పవన్ కళ్యాణ్ కి అడిగితే, రా నువ్వే రా నిన్ను పడుకోబెడతా అంటూ బండ్ల గణేష్ నోటికి వచ్చినట్లు వాగాడు. సమయంలో రోజా చెప్పు తీసుకొని కొడతా అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయారు.
ఆ తర్వాత కూడా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. బండ్ల గణేష్ అవకాశం వచ్చినప్పుడల్లా రోజాపై షాకింగ్ కామెంట్లు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఓడిపోవడంతో ఎగతాళిగా మరోసారి ఆమెపై కామెంట్ చేసి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇకపోతే ఈసారి వైసీపీ కనీసం 20 సీట్లు కూడా గెలుచుకోకుండా దారుణంగా ఓడిపోయింది. జగన్ ఓడిపోవడానికి ఆయన చేసిన తప్పులే కారణమని అంటున్నారు. చంద్రబాబుపై ప్రేమతో ఆయనను గెలిపించలేదని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు. మద్యం పాలసీ, ఇసుక దందా, అభ్యర్థుల మార్పు, అతిగా సంక్షేమ పథకాల అమలు వల్ల పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. దాని వల్ల జగన్ మరోసారి గెలిచే అవకాశాన్ని చేజేతులా కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: