కాలుష్యంతో గుండెపోటు, పిరితిత్తులే కాదు.. దానికి కూడా ముప్పు ఉంది..?
అయితే పర్యావరణాన్ని రక్షించాలి అని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి ఎక్కడ ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం పాటు పడకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పూర్తిగా సహజ వనరులు కాలుష్యం జరిగేలా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వాహనాల వాడకం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో గాలి కాలుష్యం విపరీతంగా జరిగిపోతుంది. అయితే గాలి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, గుండెకు సమస్యలు ఏర్పడతాయి అన్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో గాలి కాలుష్యం కారణంగా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఇటీవలే వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. గాలి కాలుష్యంతో ఊపిరితిత్తులు, గుండెకు మాత్రమే కాదు కళ్లకు కూడా ఎంతో చేటు అంటూ సూచించారు. గాలి కాలుష్యం కారణంగా కంటి చూపుకోల్పోయే ప్రమాదం ఉందని ఎప్పటికీ తిరిగి రాదు అంటూ హెచ్చరించారు శాస్త్రవేత్తలు. దృష్టి లోపం లేని 1.15 లక్షల మందిని వివిధ కాలుష్య పరిమితులలో పరిశీలించగా వారు చూపు కోల్పోయే ఆస్కారం ఉంది అనేది బయటపడింది అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.