నాగచైతన్య-సమంత విడాకులకు కారణం ఫోన్ ట్యాపింగ్ .. బిజెపి నేత సంచలన కామెంట్స్ ..!

Divya
అక్కినేని నాగచైతన్య హీరోయిన్ సమంత ప్రేమించుకొని వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు విడిపోవడం జరిగింది. అయితే వీరు విడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడో ఒకచోట వీరి పేరు మాత్రం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా వీరి విడిపోవడానికి గల కారణాలు ఏంటి తెలియనప్పటికీ ఏవో ఒకటి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరొకసారి నాగచైతన్య, సమంత విడాకుల చర్చించే పరిస్థితి ఏర్పడింది. పుష్ప సినిమాకి ముందు జరిగిన విడాకుల వ్యవహారం అప్పట్లో చాలా సంచలనంగా మారింది.

అయితే ఇప్పుడు హఠాత్తుగా మరొకసారి నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం తెరమీదకి తీసుకురావడంతో రాజకీయంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్  వ్యవహారం లో వినిపిస్తున్నది బిజెపికి చెందిన బూర నరసయ్య గౌడ్ వీరి పైన పలు విషయాలు తెలియజేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారని ఇప్పటి వరకు ఈ విషయం ఎవరు కూడా ఆరోపించలేదంటూ తెలియజేశారు. నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్  కు చుట్టుకుందంటూ తెలియజేశారు.

తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలంటూ బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఈ రోజున నిరసనలతో తెలియజేశారు. ఈ సందర్భంగా బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ సమంత ,చైతన్య విడిపోవడానికి ఇదే ముఖ్య కారణం అంటూ ఫోన్లు ట్యాప్ చేసి వారి యొక్క బెడ్ రూమ్ లలో తొంగి చూస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ విషయాలను మాజీ సీఎం కేసీఆర్ మేనల్లుడు మాజీ మంత్రి హరీష్ రావు ట్యాపింగ్ చేశారని కూడా మరొక సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పలువు బిఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయాలను ఖండిస్తున్నారు. మరి ఈ విషయాల పైన ఎవరు స్పందిస్తారో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: