గెలుపుకోసం దేవుడిపై భారం వేసిన బీజేపీ.. ప్రజాతీర్పు ఎలా ఉంటుందో..?
నగరంలోని 150 డివిజన్లలో వివిధ పార్టీల నుంచి ఈసారి 1122 మంది అభ్యర్థులు పోటీచేశారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండడం విశేషం.. ఈ సరి అన్ని పార్టీ లు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం చూస్తున్నాం.. బీజేపీ, తెరాస పార్టీ లు మహిళల సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.. అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండడంతో తెరాస పార్టీ విధానాలు గ్రేటర్ లో మార్చుకొంది. దుబ్బాక లో ఓటమి తర్వాత తెరాస పార్టీ ప్రజల విషయంలో కొంత తగ్గింది..
తెరాస ని కాదని బీజేపీ ని గెలిపించడం వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకుని తెరాస ముందే అప్రమత్తమైంది చెప్పొచ్చు.. ఇక బీజేపీ కూడా తక్కువేం తిన లేదు..గ్రేటర్ లో తెగించి పోరాటం చేశారు. తెరాస ను ఎదుర్కోవడమే లక్ష్యంగా ముందుకు సాగారు.. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల బీజేపీ నాయకులు సైతం టీఆర్ఎస్కు దీటుగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అయితే విపరీతంగా డబ్బులు ఖర్చు చేసిన ప్రాంతాల్లోని పలువురు అభ్యర్థులు కౌంటింగ్ నేపథ్యంలో ప్రస్తుతం దేవుళ్లపై భారం వేస్తున్నారు.