పుట్టినరోజు వేళ తన గురించి మోడీ చెప్పిన సంచలన రహస్యాలు..?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్రమోడీ జీవితం గురించి అందరికీ తెలిసిందే. పేరుకు పెళ్లయినా ఆయన బ్రహ్మచారిగానే జీవితం గడిపారు. జీవితాన్ని పార్టీకి, ఆర్ఎస్‌ఎస్‌ కు అంకితం చేశారు. తల్లి తప్ప ఆయనకు జీవితంలో ఆప్తులెవరూ లేరు. దశాబ్దాలుగా ఆయన అటు గుజరాత్ సీఎంగానూ.. ఆ తర్వాత భారత ప్రధానిగానూ అధికారంలో ఉన్నా ఎవరినీ ఆయన దరచేరనీయలేదు. నేడు ప్రధాని పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వాటిలో షాకింగ్ వాస్తవం ఏంటంటే.. ఆయన చాలాకాలం వరకూ భిక్షమెత్తుకునే ఆకలి తీర్చుకున్నారట. ఆర్ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్నప్పుడు భిక్షాటన ద్వారానే ఆహారంపొందేవారట. దాదాపు అలా రెండున్నరేళ్లు ఆయన గడిపారట. ఇక మోడీ మీరు డబ్బు ఏంచేస్తారు అని అడిగితే.. అసలు తాను ఎప్పుడూ డబ్బు దగ్గర ఉంచుకోనని చెప్పారు. చిన్నప్పుడు వాళ్లమ్మ పెద్దగా డబ్బు ఇచ్చేవారు కాదట. మహా ఇస్తే పదో పదకొండు రూపాయలో ఇచ్చేవారట. ఒకసారి మాత్రం 5000 రూపాయలు ఇచ్చి కాశ్మీర్‌లో వరద బాధితులకు ఇవ్వమని చెప్పారట.
ఇక తనకు వంట కూడా వస్తుందంటూ ప్రధాని మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన చాయ్ వాలా అన్న సంగతి తెలిసిందే. ఆయన కిచీడీ బాగా చేస్తారట. ఎందుకంటే అది చాలా సులభంగా పూర్తవుంది కాబట్టి అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ప్రతి వ్యక్తికీ జీవితంలో ఆత్మీయుడైన మిత్రుడు ఒకరు కచ్చితంగా ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. తనకూ అలాంటి ప్రాణ స్నేహితుడు ఉన్నారని.. కానీ ఆయన పేరు బయటపెట్టదలచుకోలేదని చెప్పారు.
గతంలో వకీల్ సాబ్ అనే వ్యక్తి చాలా ఆత్మీయంగా ఉండేవారని.. ఆయన ఇప్పుడు బతికిలేరు కాబట్టే ఆయన పేరు ను బయటపెడుతున్నానని ప్రధాని మోడీ చెప్పారు. తనకు ప్రకృతి అంటే చాలా ఇష్టమని జీవితంలో దశాబ్దాల తరబడి తాను కొండకోనల్లోనే బతికానని ఆయన వివరించారు. తన దగ్గర అసలు డబ్బు ఉండదని.. డబ్బు ఉంచుకునే అలవాటు లేక చాలా ఇబ్బందులు కూడా పడ్డానంటూ ఆయన హాస్యంగా కొన్ని ఉదాహరణలు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: