పల్నాడు : ఆగని ఆగ్రహ జ్వాలలు..ఆ రెండు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తి అయిపోయాయి.పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాలలో ఆగ్రహ జ్వాలలు ఎగసి పడ్డాయి.పోలింగ్ పూర్తి అయి రెండు రోజులు పూర్తి అయినా కూడా  ఇప్పటికీ గొడవలు జరుగుతూనే వున్నాయి..పోలింగ్ రోజు గొడవలు జరిగిన సమయం నుండి ఇప్పటి వరకు టెన్షన్ వాతావరణమే నెలకొంది. చాలా ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. కొన్ని ఏరియాల్లో అయితే రాడ్లు, చైన్లు వేట కొడవళ్లు వెంట బెట్టుకుని మరీ ప్రత్యర్థులపై దాడి చేసారు.టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య గొడవలు తీవ్ర స్థాయి లో జరిగాయి..పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసారావు పేట మరియు గురజాల నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. 

అంతేకాదు ఆయా పట్టణాల్లోకి వచ్చే వాహనాలను కూడా క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.రెండు రోజులపాటు దుకాణాలు మూసివేయాలని పోలీసులు స్థానికులను విజ్ఞప్తి చేశారు. అలాగే నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గూమి కూడి కనిపించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యం లో స్థానిక వ్యాపారులు వారి దుకాణాలు మూసివేశారు. రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగం లోకి దించారు.అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి లో కూడా 144 సెక్షన్ అమలవుతోంది. వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి మరియు టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి లను వేర్వేరు ప్రాంతాలకు తరలించారు పోలీసులు. ఇరువురు నేతల ఇళ్ల వద్ద భారీగా బందోబస్తు పెంచారు.టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయయ్యారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కాంచన హాస్పిటల్ కు తరలించారు. ఎన్నికలు ముగిసిన కూడా రాష్ట్రం లో ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు.. ఇన్నేళ్ల రాష్ట్ర చరిత్ర లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురు కాలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: