"భజే వాయు వేగం" ఓవర్సీస్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ కొన్ని రోజుల క్రితమే "బెదురులంక 2012" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు వరస అపజాయలతో డీలా పడిపోయిన ఈ నటుడు "బెదురులంక 2012" మూవీ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇక తాజాగా ఈయన భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యు వి కాన్సెప్ట్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ చాలా స్పీడ్ గా కంప్లీట్ అయింది.
 

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుండి చిత్ర బృందం గ్లిమ్స్ వీడియోని విడుదల చేసింది. ఆ తర్వాత ఏకంగా మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ ని మే 30 తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మివేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను కూడా ఈ మూవీ బృందం వారు అమ్మి వేశారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

ఈ సినిమా యొక్క ఓవర్ సీస్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ను "యూ ఎస్ ఏ" లో 30 వ తేదీనే ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బెదురులంక 2012 మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్న కార్తికేయ ఈ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మే 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: