ప్లాస్మా డోనేషన్ చేసి ప్రాణదాతలు కండి.. పెద్దమనసు చాటుకున్న పాణ్యం వైసీపీ కార్యకర్త !
ఈ సందర్భంగా యువ నేత కాటసాని శివ నరసింహ రెడ్డి వైఎస్సార్ సీపీ కార్యకర్త... "రాం గోపాల్" ప్లాస్మా దానం చేయడంపై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.. అయన్ని అభినందించారు. అయితే మొన్నటికి మొన్న కరోనా వైరస్ బారినపడి కోలుకున్న కర్నూలు జిల్లా కోడుమూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుధాకర్ కూడా ప్లాస్మా ధ్యానం చేసి పెద్దమనసు చాటిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేసి... ప్రాణ దానం చేయాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా కలెక్టర్ ఆనంద్ కూడా ప్లాస్మా డొనేట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో కరోనా వైరస్ మంచి కోరుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే కరోనా వైరస్ బారిన పడిన వారిని రక్షించిన వారమవుతాము అంటూ కలెక్టర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ప్లాస్మా దానం చేయడం కారణంగా ఎంతో మంది చిన్నారులకు వృద్ధులకు కూడా... ప్రాణం పోసిన వారము అవుతాము అంటూ తెలిపారు కలెక్టర్ ఆనంద్, అంతే కాకుండా అటు మెగాస్టార్ చిరంజీవికూడా ప్లాస్మా దానం చేసి ఎంతోమందికి ప్రాణదాతలు కావలి అంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరింత మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ప్లాస్మా దానం గొప్పతనాన్ని గురించి చెబుతూ... ప్లాస్మా దానం చేయాలంటూ సూచిస్తున్నారు.