పవన్ మూవీ నుండి డైరెక్టర్ తప్పుకున్నారు... నిర్మాత స్టేట్మెంట్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నీది అగర్వాల్ హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా రోజుల క్రితం హరిహర వీరమల్లు అనే మూవీ స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడిగా పని చేస్తూ ఉండగా ... ఈ సినిమాను ఏ  ఏం రత్నం నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత అనేక కారణాల వల్ల చాలా సార్లు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి మళ్లీ ఆగిపోయింది.

ఇలా పలు మార్లు జరగడంతో ఈ సినిమా ఆగిపోయింది అని వార్తలు కూడా వచ్చాయి. కానీ రత్నం మాత్రం ఈ సినిమా ఆగిపోలేదు , దినిని పూర్తి చేసి విడుదల చేస్తాం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఈ సినిమా చాలా లేట్ అవుతూ ఉండడంతో డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నాడు అని మరో కొత్త దర్శకుడు ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. అలాంటి సమయం లోనే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.

అందులో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి క్రిష్ తో పాటు జ్యోతి కృష్ణ అనే పేరును కూడా జోడించారు. దాని తోనే క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నట్లు దాదాపు అందరికీ అర్థం అయింది. కాకపోతే అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ నిర్మాత అయినటువంటి రత్నం , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకున్నాడు. మిగిలిన షెడ్యూల్ ను తన కుమారుడు అయినటువంటి జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తారు అని , త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాము అని ఆయన చెప్పుకొచ్చాడు. దీనితో క్రిష్ ఈ మూవీ నుండి తప్పుకున్నట్లు జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నట్లు అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

amr

సంబంధిత వార్తలు: