డౌట్స్ క్లియర్..! శర్వానంద్ నెక్స్ట్ మూవీ ఆ డైరెక్టర్‌తోనే..!

Amruth kumar
శర్వానంద్ అంటే మినిమం గ్యారెంటీ హీరో. ఈ సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి'తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించిన శర్వా, ఇప్పుడు తన తదుపరి వేటను మొదలుపెట్టారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో 'శ్రీను వైట్ల మార్క్ కామెడీ' అంటే ఒక బ్రాండ్. వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను ఊపేసిన శ్రీను వైట్ల, కొంతకాలం విరామం తర్వాత మళ్ళీ తన పాత వైభవాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. శర్వానంద్-శ్రీను వైట్ల కలయికలో రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.'నారీ నారీ నడుమ మురారి' సక్సెస్ మీట్ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. "శ్రీను వైట్ల గారితో నా తదుపరి సినిమా ఉండబోతోంది. ఇది పక్కా ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్. అందరూ మళ్ళీ వింటేజ్ శ్రీను వైట్ల గారి కామెడీని ఈ సినిమాలో చూస్తారు" అని ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.



శ్రీను వైట్ల సినిమాల్లో ఉండే ఆ టిపికల్ బాడీ లాంగ్వేజ్, ఫన్నీ క్యారెక్టరైజేషన్లు మళ్ళీ ఈ సినిమాలో కనిపించబోతున్నాయట. తాజా సమాచారం ప్రకారం, 'మ్యాడ్' మరియు '8 వసంతాలు' సినిమాలతో యూత్‌ను ఆకట్టుకున్న కేరళ కుట్టి అనంతిక సనీల్ కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నారు. శర్వానంద్ లాంటి వెర్సటైల్ నటుడు, అనంతిక లాంటి యంగ్ బ్యూటీ మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.శర్వానంద్‌కు సంక్రాంతి అంటే ఒక సెంటిమెంట్. అందుకే ఈ సినిమాను కూడా సంక్రాంతి 2027 లో విడుదల చేస్తామని శర్వా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. అంటే వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ గర్జన పక్కా అన్నమాట. ఈ సినిమాలో మరో సీనియర్ నటుడు మరియు ఒక మలయాళ హీరో కూడా కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరంగా చూస్తే.. హీరో యంగ్ ఏజ్‌లో ఆవేశంలో చేసిన ఒక పని వల్ల అతని లైఫ్‌లో జరిగే డ్రామా చాలా ఫన్నీగా, ఎమోషనల్‌గా ఉండబోతోందట.



నిరంతరం విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్, శ్రీను వైట్లను మళ్ళీ ట్రాక్‌లోకి తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. 'విశ్వం' సినిమాతో కాస్త మెప్పించిన శ్రీను వైట్ల, ఈసారి శర్వాతో కలిసి ఒక ప్రాపర్ కమర్షియల్ హిట్ కొట్టాలని కసరత్తులు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే షూటింగ్ ప్రారంభించి, వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.మొత్తానికి శర్వానంద్ తన సక్సెస్ జర్నీని శ్రీను వైట్లతో కొనసాగించబోతున్నారు. నవ్వులే ఆయుధంగా రాబోతున్న ఈ 'క్రేజీ కాంబో' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. శర్వానంద్ ఫ్యాన్స్‌కు మాత్రం 2027 సంక్రాంతికి ముందే పండగ గిఫ్ట్ కన్ఫర్మ్ అయ్యింది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: