మూడు నెలల గర్భవతి ని చంపిన భర్త.. అసలు కారణం ఏంటో తెలుసా..?

praveen

అగ్నిసాక్షిగా పెళ్లి పెళ్లి చేసుకున్నారు.. మూడు ముళ్ళతో ఒక్కటయ్యారు.. చివరకు ఒకరికొకరు తోడు ఉంటాను అంటూ ప్రమాణం చేశారు.. పెళ్లి పెద్దల సాక్షిగా ఏడు అడుగులు వేసారు...  కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు, కొన్ని రోజులకే భర్త నిజస్వరూపం బయటపడింది. అత్తారింట్లో అడుగుపెట్టి ఎంతో ఆశగా దాంపత్య జీవితాన్ని గడపాలి అనుకున్నా ఆ పెళ్లి కూతురికి కొన్ని రోజుల్లోనే భారీ షాక్ తగిలింది. అత్తారింట్లో ఆనందం ఏమో కానీ భర్త అదనపు కట్నం వేధింపులు మాత్రం రోజురోజుకూ ఎక్కువైపోయాయి, వెరసి ఆ మహిళకు ప్రశాంతత కరువైంది. 


 చివరి వరకు  తోడుగా ఎలాంటి సమస్య రాకుండా కాపాడుకుంటాను అంటూ ప్రమాణం చేసిన భర్త ఆమె ప్రాణాలు తీసేసాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలోని  హవేలీ ఘన్ పూర్ మండలం జరిగింది ఈ ఘటన. పోతంశెట్టి పల్లి గ్రామానికి చెందిన అంజలిని... సర్దన గ్రామానికి చెందిన అభిలాష్ 2018 లో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల వరకు వీరి దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. 

 

 ఆ తర్వాత అదనపు కట్నం వేధింపులు చేయటం మొదలు పెట్టాడు అభిలాష్ మొదట బైక్ కావాలని కోరగా అత్తమామలు 50 వేల రూపాయలు ఇచ్చారు. సంతృప్తి పడక మరో లక్ష రూపాయల కట్నం తీసుకురావాలని అంటూ  భార్యను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినప్పటికీ తీరు మార్చుకోలేదు. క్రమంలోనే  మంగళవారం ఉదయం మరోసారి భార్యభర్తలిద్దరు మధ్య గొడవ జరిగింది. ఇక క్షణికావేశంలో అభిలాష్ భార్య అంజలి గొంతునులిమి చంపేశాడు. తన భార్య ఆత్మహత్య చేసుకుంది అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అల్లుడు పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: