గత కొద్దీ రోజుల నుండి కేరళ లో భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొత్తగా 24 కరోనా కేసులు నమోదు కాగా అందులో 23కేసులు విదేశాల నుండి వచ్చిన వారు కాగా మరొకటి కాంటాక్ట్ కేసని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిపి కేరళ లో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 666 కు చేరింది. అందులో ప్రస్తుతం 161కేసులు యాక్టీవ్ గా ఉండగా ముగ్గురు మరణించారు. 502 మంది బాధితులు కోలుకున్నారు.
ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. ఈరోజు కొత్తగా 743 కేసులు నమోదు కాగా 987 మంది కోలుకోవడం హర్షించదగ్గ విషయం అలాగే కర్ణాటక లో ఈరోజు 67 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 68 కేసులు నమోదు కాగా మొత్తం 53 మంది కరోనా వల్ల మరణించారు. ఇక ఈరోజు తెలంగాణకు సంబందించిన హెల్త్ బులెటిన్ ఇంకా విడుదలకావాల్సి వుంది.