మంత్రి అనిల్ అనవసరంగా పప్పులో కాలేసారా...?
ఏపీలో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. వైసీపీ నుంచి ఎక్కడైనా చిన్న లోపం దొరు కుతుందేమో అని టీడీపీ నేతలు అంతా చకరో పక్షుల్లా కాచుకుని కార్చొని ఉన్నారు. ఇక టీడీపీ వాళ్లు ఎన్ని విమర్శలు చేస్తున్నా... ఇటు వైసీపీ నేతలు... మంత్రులు ఎంత మాట్లాడినా వీరిలో వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన మంత్రి కొడాలి నాని... మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్లు ఇస్తే ఆ స్ట్రాంగ్ నెస్ వేరుగా ఉంటుంది.
అయితే తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పై చేసిన ప్రకటనలో మంత్రి అనీల్ అనవసరంగా పప్పులో కాలేసారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా తెలుగుదేశం నేతలు గాని మాజీ మంత్రులు గాని ఎవరు అయినా మీడియా తో మాట్లాడితే కాస్త ఆధారాలతో మాట్లాడుతూ ఉంటారు. కాని వైసీపీ నేతల వద్ద పేపర్లు తప్పా అన్నీ ఉంటాయి. మంత్రి అనీల్ మాట్లాడే ముందు ఆయన శాఖను గుర్తించి మాట్లాడాల్సి ఉంటుంది.
కాని ఆయన మాట్లాడే విషయంలో దూకుడుగా మాట్లాదేసారు గాని వెనుకా ముందు ఆలోచించుకోలేదు. పోలవరం 71 శాతం పూర్తి అయింది అని గత ఏడాది జూన్ లో ఆయనే ఒక ప్రకటనలో చెప్పారు. ఇప్పుడు ఆయనే మీసం తిప్పి పూర్తి అయితే మీసం తీయిస్తా అన్నారు. అనవసరంగా టీడీపీ సోషల్ మీడియా ఆయన్ను మీసం తియ్యాలి అని సవాల్ చేస్తుంది. దేవినేని ఉమా ఆధారాలతో సహా చూపించారు.
దీనిపై ఇప్పుడు ప్రభుత్వంలో కూడా పెద్ద చర్చే జరుగుతుంది. జలవనరుల శాఖ అనేది ఆషామాషీ శాఖ కాదని కాబట్టి ఏదైనా మాట్లాడాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించాలని సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే దాని గురించి మాట్లాడాలి గాని ఆవేశాలు సవాళ్లు ఆ శాఖ విషయంలో పని చేయవు అంటూ పలువురు మంత్రి అనీల్ కి సూచనలు చేస్తున్నారు. అనవసరంగా తొందరపడవద్దని చెప్తున్నారు.