అసదుద్దీన్‌ను భయపెడుతున్న మాధవీలత.. అందుకే అలా చేశారా?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన మాధవీలత తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె కట్టర్  హిందువులూ కన్పిస్తున్న ఓల్డ్ సిటీలో ముస్లింలతో మమేకం అవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవైసీ బ్రదర్స్ కంచుకోటలా భావించే ఓల్డ్ సిటీలో తన ప్రచారంతో అందర్నీ కలుపుకొని పోతున్నారు.

పదేళ్ల కాలంలో ఓవైసీ బ్రదర్స్ పాతబస్తీకి చేసిందేమీ లేదని ఎద్దేవా చేస్తున్నారు. కేవలం వారు అధికారంలో తమ స్వార్థం మాత్రమే చూసుకుంటారని విమర్శించారు. తాను ఎంపీగా గెలిస్తే.. ఓవైసీ చేయలేని డెవలెప్ మెంట్ ను చేసి చూపిస్తానని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఆమెకు ఓల్డ్ సిటీలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఆమె ఇటు ఓటర్లను తన ప్రసంగాలు, కట్టు బొట్టు, వేషధారణ, కట్టర్ హిందులా కన్పించినా కూడా ముస్లింలను కలుపుకొని వెళ్తున్నారు.

రామాలయం, హనుమాన్ జయంతి శోభాయాత్రలో ఆమె చేసిన వ్యాఖ్యలు, బహిరంగ ప్రసంగాలు, మసీదులపై బాణం ఎక్కుపెట్టడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీజేపీ అగ్రనేతలు సైతం మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. మాధవీలతను చూసి కాపీ కొట్టారో ఏమో తెలియదు కానీ.. మలక్ పేట్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ముసారాంబాగ్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించే క్రమంలో పురోహితులు అయనకు పూలమాలలు వేశారు. ఆశీర్వచనం అందించారు. ఆయనకు మద్దతు సైతం తెలిపారు. అసదుద్దీన్ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా.. తాజాగా నిర్వహించిన ప్రచారంలో పురోహితులు ఆయనకు పూలమాల వేసి మద్దతు తెలిపారు. పలుమార్లు హిందూ దేవుళ్లపై, హిందూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయన తాజాగా పండితుల ఆశీర్వాదం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద మాధవీలత భయంతోనే ఆయన పండితులను కలిశారని.. ఇది మాధవీలత సాధించిన గొప్ప విజయంగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

mim

సంబంధిత వార్తలు: