ప్రియుడి మరణంతో మనస్తాపానికి గురైన ప్రేయసి.. పిన్ని ఇంట్లో ఏం చేసిందో చూడండి..
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పూర్ణా మార్కెట్ కు చెందిన ఓ మైనర్ బాలిక అదే ప్రాంతానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది.. ఏడాది కిందట శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. ప్రియుడి మరణవార్త తెలిసి ఆమె తీవ్ర వేదనకు గురైంది. డిప్రెషన్కి లోనవడంతో మానసిక స్థితి సక్రమంగా లేదని భావించిన తల్లిదండ్రులు మార్పు కోసం బాలికను జోడుగుళ్లపాలెంలోని పిన్ని ఇంటికి పంపారు..
అక్కడ ఆమె మానసిక పరిస్థితి పూర్తిగా బాగా లేకపోవడంతో ఆమె పిన్ని ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని ఫ్యాన్ కు ఉరి వేసుకుంది..ప్రియుడిని మర్చిపోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డెడ్బాడీని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె ఒంటరిగా ఉండటంతో బలాన్మరానానికి పాల్పడిందని.. పోలీసులు తేల్చి చెప్పారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కూతురు దూరంగా ఉంటే అన్న బ్రతుకుతుంది అని అనుకుంటే ఇలా విగతజీవిగా రావడంతో ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..