సొల్లు మాటలు కట్టిపెట్టు బాబు..!?
ప్రస్తుతం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ లో కరోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ కరోనా వైరస్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయింది. మర్కజ్ కు వెళ్లి ఢిల్లీ నుండి తిరిగివచ్చిన వారికీ ఎక్కువ శాతం కరోనా వైరస్ వచ్చింది. దీంతో రెండు మూడు రోజుల్లోనే కరోనా వైరస్ సంఖ్య భారీగా పెరిగిపోయింది.
అయితే పాజిటివ్ కేసులనే అదునుగా చేసుకున్న ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయం చెయ్యాలని చూసింది. ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణలో విఫలం అయ్యింది అని ప్రతిపక్షం సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే ఆ వ్యాఖ్యలపై గత రెండు రోజుల నుండి విజయసాయి రెడ్డి ఫైర్ అవుతూనే ఉన్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా బాబోరుపై ఫైర్ అయ్యారు.. ''ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో సిఎం జగన్ గారు మాట్లాడింది విన్న తర్వాత రాష్ట్ర సన్నద్ధత గురించి ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా బాబూ? సొల్లు మాటలు కట్టిపెట్టండి. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధురాలి బంధువులు గడ్డి పెట్టారుగా. సిగ్గుతెచ్చుకోండి.'' అంటూ ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబోరు ఎప్పుడు అవకాశవాది అని.. గుంటనక్క అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
ఐదేళ్లలో అత్యవసర వైద్య సదుపాయాలు పెంచింది లేదు. వెంటిలేటర్లు, కొత్త ఐసియూల ఏర్పాటుకు రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు. ఇపుడు కరోనాలాంటి వ్యాధులు వస్తాయని తనకు ముందే తెలుసుని కథలు చెబ్తున్నాడు. 108, 104 అంబులెన్సుల్ని మూలన పడేసి ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టి వెళ్లిపోయాడు. — Vijayasai reddy v (@VSReddy_MP) April 3, 2020
ప్రధానితో వీడియో కాన్ఫరెన్సులో సిఎం జగన్ గారు మాట్లాడింది విన్న తర్వాత రాష్ట్ర సన్నద్ధత గురించి ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా బాబూ? సొల్లు మాటలు కట్టిపెట్టండి. శవ రాజకీయాలు చేయొద్దని చోడవరంలో చనిపోయిన వృద్ధురాలి బంధువులు గడ్డి పెట్టారుగా. సిగ్గుతెచ్చుకోండి. — Vijayasai reddy v (@VSReddy_MP) April 3, 2020