ప్రియురాలిని చంపి.. శవాన్ని పక్క సీట్లో పెట్టుకుని ప్రయాణం.. చివరకు ఏం జరిగిందంటే..?
ఇటీవల కాలంలో మనుషులు ఎంత పైశాచికంగా మారుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, మోసాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, గంజాయి అక్రమ రవాణా, మహిళలపై వేధింపులు, భూకుంభ కోణాలు, సైబర్ నేరాలు, స్త్రీ, పురష అనైతిక సంబంధాలు, ప్రేమ కార్యకలాపాలు రోజురోజుకు వికృత రూపం దాల్చుతున్నాయి. ఇక తాజాగా ప్రేమించిన అమ్మాయినే హత్య చేశాడు ఓ కిరాతకుడు. వారిందరూ ఎంతగానూ ప్రేమించుకున్నారు. అంతలోనే ఆ ప్రేమ కాస్తా అనుమానంగా మారింది. అ అనుమానం కాస్తా పెనుభూతంగా మారి ప్రియురాలు.. ప్రియుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత జూలైలో దుబాయ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక కోర్టు ఆదివారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే అందిన సమాచారం ప్రకారం.. ఇండియాకు చెందిన 27 ఏళ్ల యువకుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివసిస్తున్నాడు. ఆ సమయంలోనే భారత్కే చెందిన యువతితో అతడు ప్రేమలో పడ్డాడు. కొన్ని రోజులపాటు చట్టాపట్టాలేసుకుని సజావుగా సాగిన వీరి బంధంలో అనుమానం అనే పెనుభూతం చిచ్చు పెట్టింది. తనను కాదని ప్రియురాలు మరో వ్యక్తితో మాట్లాడుతోందని భావించిన సదరు యువకుడు.. తరచూ ఆమెతో గొడవపడుతూ ఆమెను దూషించేవాడు.
అయితే ఒక రోజు ప్రియురాలిని కారులో తనను తీసుకువెళ్లి నచ్చచెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం ముదిరి... చివరకు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు. అక్కడితో ఆగని ప్రియుడు.. ఏకంగా తన కారు ముందు సీట్లోనే ప్రియురాలి శవాన్ని పెట్టుకుని దాదాపు 45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఓ హోటల్లో ఆగి భోజనం చేశాడు. అనంతరం డైరాలోని పోలీసు స్టేషనులో లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో కేసు ఆదివారం విచారణకు వచ్చింది. ఇక ఈ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ లాయర్ వాదించినట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే కోర్టు తీర్పు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.