బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి పదేళ్ల చిన్నారిపై అత్యాచారం...

siri Madhukar

ప్రతిరోజూ ఆడవారిపై కామాంధులు అఘాయిత్యాలకు పాల్పపడుతూనే ఉన్నారు.  దేశ వ్యాప్తంగా నిర్భయ, దిశ కేసులకు సంబంధించిన కఠిన శిక్షలు చూసి కూడా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.  మరీ దారుణమైన విషయం ఏంటేంటే.. తాము చేస్తున్న అకృత్యాలు వీడియోలు తీసి మరి పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు.  చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కృరమృగాళ్లలా రెచ్చిపోతున్నారు.  నెలల వయసు ఉన్న చిన్నారులపై సైతం కామంతో రెచ్చిపోయి అత్యాచారాలు చేస్తున్నారు. కేవలం అత్యాచారాలు మాత్రమే కాదు తమ గుట్టు బయట పడుతుందని హత్యలకు కూడా తెగబడుతున్నారు కామాంధులు. ప్రభుత్వంలో ఉన్న లొసుగులు క్యాష్ చేసుకొని శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. 

 

తాజాగా ఓ నిశ్చితార్థ వేడుకకు వచ్చిన పదేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. వేడుకల్లో క్యాటరింగ్ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.  అందరూ నిశ్చితార్థ వేడుక సంబరాల్లో ఉండగా అదును చూసి పదేళ్ల బాలికను నోరు నొక్కి బలవంతంగా బాత్ రూమ్ లోకి తీసుకువెళ్లి.. అత్యాచారం చేశాడు. ఈ దారుణ అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కు చెందిన దంపతులు తమ పదేళ్ల కుమార్తెతో కలసి బంధువుల నిశ్చితార్థ వేడుకలకు వెళ్లారు.  కొద్ది సేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో అంతావెతికి చూశారు.

 

చివరిగా బాత్ రూమ్ వైపు చూడగా గడియ వేసి ఉండటంతో  అనుమానం వచ్చి తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసిన నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు.  అక్కడ ఉన్న వారినందరినీ ప్రశ్నించగా భోజనాలు వడ్డించేందుకు క్యాటరింగ్‌ బృందంతో వచ్చిన రాజు కంగారుపడ్డాడు. గట్టిగా నిలదీయడంతో బాలికను తానే బలవంతంగా బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దాంతో అతనికి దేహ శుద్ది చేసిన తర్వాత పోలీసులకు అప్పజెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: