అజిత్ పవార్తో బీజేపీ ఎంపీ భేటీ.. మరి కాసేపట్లో బలపరీక్ష...
ఊహించని మలుపులతో రక్తికట్టించిన మహారాష్ట్ర రాజకీయాలు ఉద్ధవ్ ప్రమాణ స్వీకారంతో ఓ కొలిక్కి వచ్చాయి. ఉద్ధవ్ ఠాక్రే నేడు అసెంబ్లీలో బలపరీక్షను నేడు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలోనే బీజేపీ ఎంపీతో ఎన్సీపీ నేత అజిత్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ రావు చిఖాలికర్, పవార్ శనివారం ఉదయం కలిశారు. అయితే, ఇది కేవలం మర్యాద పూర్వమేనని అజిత్ తెలిపారు. పార్టీలు వేరైనా తమ మధ్య చాలా కాలంగా ఆత్మీయ సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఆయన. అంతేకాదు నేటి బలపరీక్షపై కూడా ఎటువంటి చర్చ జరగలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ‘మహా వికాస్ ఆఘాడీ’ మెజార్టీ నిరూపించుకుంటుందని ఆయన గట్టిగా ధీమా వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎంపై ఎలాంటి గోడవా లేదని, అవన్నీ మీడియా ఊహాగానాలేనని అజిత్ ఈ ముఖంగా కొట్టి పారేశారు. ఇదిలా ఉండగా, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తమ కూటమికి 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమను ఎవరూ ఓడించలేరంటూ ట్విటర్ పూర్వకంగా తెలిపారు. కాగా, ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకోగా, కాంగ్రెస్ నేత, మంత్రి బాలాసా హెబ్ థోరట్ మాట్లాడుతూ తమ పార్టీ తరఫున స్పీకర్ అభ్యర్థిగా నానా పటోల్ ని ఎంపిక చేసినట్లు ఆయన తెలియ చేసారు.
ముఖ్య మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం బాధ్యతలు అందుకున్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లు మద్దతుతో ఉద్ధవ్ బల పరీక్షలో నెగ్గడం లాంఛనమేనని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి అవసరమైనటు వంటి సంఖ్య 145. కాబట్టి, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 మంది, ప్రతిపక్ష బీజేపీకి 105 ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. మరో 12 మంది చిన్న పార్టీలు, స్వతంత్రులు కూడా మహావికాస్ అఘాడీకి మద్దతు పలుకుతున్నారు.
మరోవైపు, ప్రొటెం స్పీకర్ ను మార్చడంపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కూటమి ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తోందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఎమ్మెల్యే కాళిదాసు కొలంబకర్ ను గవర్నర్ ప్రొటెం స్పీకర్గా నియమించగా, ఆయన స్థానంలో ఎన్సీపీ సీనియర్ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్ ను శుక్రవారం బాధ్యతలని అప్పగించారు. అత్యవసరంగా క్యాబినెట్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.