ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ.. నాకు తిరుగు లేదు.. నాకు ఎదురు లేదు.. నన్నేవ్వరు మోసం చేయలేరు.. నేను నా చేతిలో మోసపోతే తప్ప.. అని నిత్యం స్తోత్కర్ష చేసుకునే చంద్రాలును ఇప్పుడు చూస్తే జాలేస్తుంది.. ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చిన చందంగా ఉంది చంద్రబాబు పరిస్థితి. చంద్రబాబు పరిస్థితి ఏంటంటే.. ఆయనకు అధికారం అప్పనంగా వచ్చిందే తప్ప ఏనాడు అధికారం కోసం ఒంటరి పోరాటం చేసింది లేదు.. అందుకే చంద్రబాబు అధికారం కోసం ఇతరుల కాళ్ళు పట్టుకోవడంతోనే సరిపెట్టుకుని, అధికారం కోసం అర్రులు చాస్తున్నారనే అపవాదు లేకపోలేదు.
ఎందుకంటే చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులు అయినా తొక్కుతారు.. అధికారం రాగానే అడ్డంగా తొక్కుతారు.. ఇది ఆయన నైజం.. అందుకే అంటారు చంద్రబాబుది ఊసరవెళ్ళి నైజమని. అందుకే చంద్రబాబును ఇప్పుడు ప్రతిపక్ష నేతగా చూస్తే ఎవ్వరికైనా జాలేయక మానదు.. చింత చచ్చినా పులుపు చావలేదు అన్న మాదిరిగా ఉంది చంద్రబాబు పరిస్థితి. అధికారం నుంచి ప్రతిపక్ష నేతగా మారిన చంద్రబాబు అధికారం చేతిలో ఉన్నంత బిల్డఫ్ ఇస్తూనే ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఇస్తున్న బిల్డఫ్ అంతా ఇంతా కాదు.. అధికారం పోయి కేవలం ఐదు నెలలు కూడా కాలేదు.. అప్పుడే అధికారం ఎలా సాధించాలా అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు తనవి కాదు.. నేను సత్యహరిచంద్రుడికి తమ్ముడిని.. ఆ తప్పులన్ని సీఎం జగన్ చేస్తున్నవే అని నంగనాచిలా బొంకుతున్నాడు చంద్రబాబు. ఆయన చేసిన తప్పిదాలు జగన్ సర్కారు ఒక్కొక్కటి అరటి పండు ఒలిచినట్లు ఒలిచి చూపుతున్నారు.. అయినా బుద్ది తెచ్చుకోకుండా చంద్రబాబు తాను చేసిందే గొప్పని నిత్యం తనను తాను పొగుడుకుంటూ, తన సొంత డబ్బా కొట్టే మీడియాతో డబ్బా కొట్టించుకుంటూ సంబురపడి పోతున్నారు.
ఇక అధికారం కోసం ఇప్పుడు చంద్రబాబు మరోమారు మోసపూరిత చర్యలకు పావులు కదుపుతున్నారు. అందుకు ఇప్పుడు బీజేపీ ప్రాపకం కోసం తెగ ఆరాట పడుతున్నారు. మామ ఎన్టీఆర్ నుంచి అధికారం గుంజుకుని అప్పనంగా సీఎం అయిన చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి ప్రతిపక్ష నేతగానే ఉండిపోయారు. ఆయన అధికారం వెలగబెట్టిన ప్రతిసారి కమ్యూనిస్టుల అండతోని, బీజేపీ దయతోని అధికారం హస్తగతం చేసుకున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చావు దెబ్బ తినడానికి కారణం కూడా లేకపోలేదు.
టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా.. అలాంటి టీడీపీ కాంగ్రెస్ పంచన చేరడాన్ని జనం జీర్ణించుకోలేదు. అందుకే జనం చంద్రబాబు మోసాన్ని గ్రహించే చిత్తు చిత్తు ఓడించారు. ఆ గుణపాఠం నుంచి తేరుకోని చంద్రబాబు మరోమారు పొత్తుల ప్రాపకం కోసం ఆరాట పడుతున్నారు. తన నమ్మినబంట్లతో ఆ పనిని బీజేపీ చేత చేయించడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ కూడా చంద్రబాబు ను నమ్మే పరిస్థితిలో లేకపోవడంతో నయానా భయానా బీజేపీని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడును నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు బీజేపీ అధిష్టానం నేతల కాళ్ళు పట్టుకోవడానికి సిద్దమయ్యారు.
బీజేపీ ప్రాపకం కోసం చేసే ప్రయత్నాలు చూస్తుంటే జాలేయక తప్పదు. తెరవెనుక చంద్రబాబు ఓవైపు మీడియాను, మరోవైపు తన నీడలైన రాజ్యసభ సభ్యులను వాడుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏదేమైనా చంద్రబాబు ఇప్పుడు వేస్తున్న ఎత్తులు చూస్తుంటే అధికారం కోసం ఎంతగా అర్రులు చాస్తున్నాడో అర్థమవుతుంది. చంద్రబాబు ఎంత స్థాయికైనా అధికారం కోసం దిగజారే పెద్దమనిషిగా మరోమారు చరిత్రలో నిలిచిపోక తప్పదు.