రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పోటీ గురించి సీక్రెట్ చెప్పిన పవన్..!

KSK
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజా పోరాట యాత్ర పేరిట రాష్ట్ర ప్రజలకు దగ్గర ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను విమర్శిస్తున్నారు పవన్. ఇదిలా ఉండగా ఇటీవల తాజాగా జనసేన విజయం మ్యానిఫెస్టో అంటూ విడుదల చేసి రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించాడు.


ఇదిలాఉండగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పవన్ సంచలన కామెంట్స్ చేశారు. నాకు తెలంగాణ ప్రజలు అంటే వాస్తవానికి పిచ్చి ప్రేమ, ఎందుకంటే ఎన్నో ఏళ్ళనుండి వెనుకబాటు తనంతో, కేవలం కొందరు పెద్ద పార్టీలు మరియు పెత్తందార్ల చేతుల్లో ఈ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఉండి దోచుకోబడింది అన్నారు.


వీర తెలంగాణ పోరులో ఎందరో మహానుభావులు, వీరులు, ఆడవారు, యువత, ఉద్యోగస్తులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరెందరో త్యాగధనుల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.


ఇక్కడ ప్రజల ఆకాంక్షనుబట్టి జనసేన పార్టీని బలోపేతం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. మనకు బలం వున్న చోట పోటీ చేద్దాం మరియు బలం లేని చోట పార్టీని అందులోని అంశాలతో ప్రజలను ప్రభావితం చేద్దామని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం తనకు ఎన్నో పాఠాలు నేర్పింది అని పేర్కొన్నారు పవన్. రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు వంటివి అని అన్నారు. వచ్చేఎన్నికలలో కచ్చితంగా ఆంధ్రాలో అధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: