ఈ మద్య మహిళలై అత్యాచారాల పర్వం విపరీతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ మహిళలపై ఎక్కడో అక్కడ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఓ జూనియర్ ఆర్టిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. డబ్బుల విషయంలో గొడవ తలెత్తగా మురో ముగ్గురితో కలిసి స్నేహితుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోదారుణమైన విషయం ఏంటంటే..బాధితురాలి స్నేహితురాల్లే నింధితులకు సహకరించారు. గుంటూరు జిల్లాకు చెందిన శిరీష, హేమలత లంగర్హౌస్లోని ఉంటూ..సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ లు పనిచేస్తున్నారు. ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్లో వీరి స్నేహితురాలైన మరో జూనియర్ ఆర్టిస్ట్ ఉంటోంది.
ఈ మద్య ఈ యువతికి రాజ్ కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడిది..అది కాస్త ప్రేమగా మారడంతో అతడు వీరి హాస్టల్ పక్కనే మరో హాస్టల్ లో ఉండటం మొదలు పెట్టాడు. అయితే ఈ మద్య జూనియర్ ఆర్టిస్ట్ లకు సరైన అవకాశాలు రాకపోవడంతో..ఈ నలుగురు కలిసి ‘మన’ అనే సంస్థను స్థాపించి జూనియర్ ఆర్టిస్ట్ ల కోసం పోరాడుతాం అంటూ అందరినీ నమ్మబలికారు. అంతే కాదు వారి నుంచి సభ్యత్వ రుసుము కూడా తీసుకున్నారు. అయితే సభ్యత్వ రుసుము ద్వారా వచ్చిన డబ్బు పంపకం లో తేడాలు వచ్చాయి..దాంతో ఆ బాధిత యువతిపై రాజ్ కిరణ్ అనే యువకుడు కక్ష్య పెంచుకున్నాడు.
మార్చి 5 శిరీష, హేమలతతోపాటు యువతిని కూడా గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జ్లో రూము తీసుకున్నారు..ప్లాన్ ప్రకారం శిరీష, హేమలు బాధిత యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపారు. అప్పటికే రాజ్ కిరణ్ ముగ్గురు స్నేహితులను పిలిపించుకొని ఆ యువతిపై అత్యాచారం చేశారు. అయితే అత్యాచారం చేసే సమయంలో ఆ ఇద్దరు యువతులు వీడియో తీశారు. దాన్ని పదే పదే బాధిత యువతికి చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. దాంతో విసిగిపోయిన యువతి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.